వారి ఆందోళనను సమర్ధిస్తున్నా... చంద్రబాబు

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పార్వతీపురం మండలం నర్సిపురంలో నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లుడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని సీమాంధ్రులు చేపట్టే ఆందోళనలు సరైనవేనని, వారు చేపడుతున్న నిరసనలను సమర్ధిస్తున్నానని తెలిపారు. కేంద్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదాకు సహకరిస్తుందని, ఇప్పటికే కొన్ని విషయాలలో చొరవ తీసుకుందని అన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడానికి వెనుకడుగు వేయలేదని... అలాగని ఇస్తుందో లేదో కూడా తెలియదని వెల్లడించారు. తాము మాత్రం ఎట్టి పరిస్థితిల్లో వెనక్కి తగ్గేది లేదని, ప్రత్యేక హోదా కోసం ప్రయాత్నాలు ఆపమని సుజనా అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu