విజయవాడలో చంద్రబాబుకు ఘన స్వాగతం

 

విజయవాడను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి విజయవాడకు వెళ్ళారు. ఆయనకు విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. గుంటూరు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు బయల్దేరారు.