నేడు ప.గో.జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి గోదావరి పుష్కర ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం వేర్వేరు శాఖల అధికారులు, జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యి పుష్కర ఏర్పాట్లను సమీక్షిస్తారు. మూడు రోజుల క్రితం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష జరిపినప్పుడు ఆయన వారికి అనేక సూచనలు చేసారు. అదే విధంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పనులను కూడా పరిశీలించి జిల్లా అధికారులకు అవసరమయిన సూచనలు చేస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu