అమరావతికి పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్


ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న తరుణంలో.. అమరావతి నిర్మాణాన్ని ఆపాలంటూ.. పర్యావరణ అనుమతులు లేవంటూ కొన్ని వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికి బ్రేక్ పడింది. అమరావతికి పర్యావరణ అనుమతుల గురించి కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రాజధానికి అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. అసలు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోయే ఈ అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతులు రావని అనుకోవడం పొరపాటే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu