ఏపీ రాజధానిలో జపాన్ బృందం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయవచ్చు, అక్కడ ఏ విధమైన డెవలప్ మెంట్ చేయవచ్చు తదితర అంశాలు పరిశీలించడానికి జపాన్ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ బృందం విజయవాడ నుండి బయలుదేరి ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడ నుండి మందడం మీదిగా తాళాయాపాలెం చేరుకుని అక్కడ నుండి కృష్ణానదిని పరిశీలించారు. అయితే ఈ ప్రాంతంలో పర్యటక కేంద్రంగా మార్చడానికి అనువైన స్థలంగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానదిపై ఆసక్తి కనపరిచి అక్కడి ప్రాంత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu