ఏపీ.. కాల్ మనీ ప్రకంపనాలు..

ఏపీలో కాల్ మనీ ప్రకంపనాలు మొదలయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ, వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలో వడ్డీ వ్యాపారులు, కార్యలయాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో విజయవాడలోని చిట్టినగర్ లో ఉన్న వడ్డీ వ్యాపారుల కార్యలయ్యాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మాచవరం పోలీసులు ఐదుగురు కాల్ మనీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక గుంటూరు, శారదాకాలనీ వడ్డి వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లో..అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫైనాన్షియర్లపై దాడులు జరిపి పలు కీలకపత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాదీనం చేసుకున్నారు.అలాగే ప్రకాశం జిల్లా, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాలలో పోలీసులు వడ్డీ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు.కాల్ మనీ వ్యాపారులపై తనకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu