ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ షాక్

ఏపీలో భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగంసిద్ధమవుతోంది. 7200కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి కావాలంటూ డిస్కంలు(విద్యుత్ పంపిణీ స్థలు)...ఈఆర్సీ(విద్యుత్ నియంత్రణ మండలి)ని కోరాయి. ఉత్పత్తి-పంపిణీ వ్యయాలు భారీగా పెరిగి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పెంపు అనివార్యమని డిస్కంలు చెబుతున్నాయి, అయితే విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనపై ఈఆర్సీ అక్టోబర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అయితే ఇంత పెద్దమొత్తంలో ప్రజలపై భారం వేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తున్న ప్రభుత్వం...కొంచెం అటూఇటుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట, ఇప్పటికే ఒకసారి ఛార్జీలు పెంచి ఉన్నందున మరోసారి భారీగా భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu