ఏపీ తొలి ఉగాది అనంతవరంలో...

 

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉగాది వేడుకలు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిఫలించేలా వేడుకల వేదికను రూపొందించారు. ఈ వేడుకలలో ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.