ఏపీలో పరిశ్రమలకు అండగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు

 

రాష్ట్రంలో వేగంగా పరిశ్రమల స్థాపన కోసం ఎకనామిక్ డెవెలప్ మెంటు బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు దరఖాస్తు చేసుకొన్నవారికి అనుమతుల కోసం వివిధ శాఖల చుట్టూ తిరుగవలసిన అవసరం లేకుండా సింగిల్ విండో పద్దతిలో ఆ బోర్డు ద్వారానే అన్ని అనుమతులు జారీ చేయాలని, వివిధ శాఖలను సమన్వయ పరుస్తూ అనుమతులు మంజూరు ఎటువంటి జాప్యం జరగకుండా చూసే బాధ్యత ఆ బోర్డుకే అప్పజెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. భూమి, నీళ్ళు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణం, కాలుష్య నివారణ సంస్థ నుండి అనుమతులు పరిశ్రమలకు సబ్సీడీలు వంటి పనులన్నిటినీ ఆ బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు సూచనలమేరకు అధికారులు బోర్డు ఏర్పాటుకు అవసరమయిన సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ బోర్డు ఏర్పాటుకు ఆమోదం లభించవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu