టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్..

ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు టీడీపీ కండువా కప్పి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆనం రాం నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందని.. రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయామని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్ని సార్లు చెప్పినా మామాట వినలేదు..కాంగ్రెస్ లో మా అభిప్రాయాలకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల్లో పునరాలోచన చేసుకోలేదు.. చేసిన తప్పు పట్ల క్షమించమని ప్రజలకు చెప్పే పరిణతి కాంగ్రెస్ సాధించలేకపోయిందని అన్నారు. కార్యకర్తలే మమ్మల్ని టీడీపీలో చేరమన్నారని.. విజయవాడ బహిరంగ సభలో నెల్లూరు కార్యకర్తలను టీడీపీలో చేర్చుతామని స్ఫష్టం చేశారు. పదవులు ఆశించి టీడీపీలో చేరడం లేదు.. రేపటి తరానికి న్యాయం చేయాలన్న లక్ష్యంతో టీడీపీలో చేరుతున్నామని రాం నారాయణరెడ్డి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu