కొనసాగుతున్న అమరనాథ్ యాత్ర.. భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై)   ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సరిగ్గా 38 రోజుల తరువాత అంటే ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది.  

ఈ యాత్రలో భక్తులు హిమాలయాల్లోని అమరనాథ్ గుహలో  మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు.   బాల్తాల్, పహల్గామ్ మార్గాల గుండా ఈ యాత్ర సాగుతుందిజ అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తుఅల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 581 కంపెనీల కేంద్ర సాయుధ  బలగాలు, డ్రోన్లు,   జామర్లతో భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.