తరతరాలు గుర్తుండిపోయేలా భోజనాలు
posted on Oct 21, 2015 4:14PM
.jpg)
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి పరిటాల సునీత ప్రకటించారు, అతిథులు లోపలికి వచ్చే సమయంలోనే భోజన ప్యాకెట్లను అందిస్తామని, పులిహోరా, చక్రపొంగలి, పెరుగన్నం, తాపేశ్వరం కాజా, అరటి పండు, మజ్జిగ, వాటర్ బాటిల్ ఇవ్వడంతోపాటు ప్రతి ఒక్కరూ భోజనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు, శంకుస్థాపన కార్యక్రమానికి తరలివచ్చే అతిథులకు కొన్నిరోజులపాటు గుర్తుండిపోయేలా భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు సునీత తెలిపారు, మంత్రులు కిమిడి మృణాళిని, పీతల సుజాతలతో కలిసి తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో వంటశాలను పరిశీలించిన సునీత... అక్కడ వండిన ఫుడ్ ఐటెమ్స్ శాంపిల్స్ ను రుచిచూసి పరిశీలించారు