మళ్లీ చేతులు కలపాలి: అద్వానీ

బీజేపీ, శివసేన మళ్లీ చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారం చేపట్టాలని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె అద్వానీ ఆకాంక్షించారు. రెండున్నర దశాబ్దాల స్నేహం విచ్ఛిన్నమైనప్పుడు తానెంతో ఆవేదన చెందానని, ఇప్పుడు మళ్లీ ఇరు పార్టీలు కలిసే అవకాశం వచ్చిందని అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. మైత్రీబంధం తెగిపోకుండా ఉండాల్సిందని తాను మొదటి నుంచి చెబుతున్నాని, తమ పార్టీ నేతలు, శివసేన నేతలు తన ప్రమేయం కోరితే తప్పకుండా సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. మహారాష్ట్ర లాంటి ప్రాధాన్య రాష్ట్రంలో పాత మైత్రీని పునరుద్ధరించాలని అద్వానీ పేర్కొన్నారు.