స్పెషల్ స్టేటస్ అడిగినందుకు అడారి కిషోర్ సస్పెండ్ ..

 

పాపం ఏపీ ప్రత్యేక హోదా కోసం నోరు విప్పినందుకు బీజేపీ నేతను పార్టీ సస్పెండ్ చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వాలని బీజేవైఎం జాతీయ కమిటీ సభ్యుడు, యువనేత అడారి కిషోర్ పార్టీకి వ్యతిరేకంగా డిమాండ్ చేశారు. దీనికిగాను.. అడారి కిషోర్ పై వేటు పడింది.  కిషోర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టారు. దీంతో తనను సస్పెండ్ చేసినందుకు పార్టీ తీరుపై కిషోర్ మండిపడ్డారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం నగర అధ్యక్షుడికి లేదని.. తాను బీజేవైఎం జాతీయ కమిటీలో ఉన్నానని... తనను సస్పెండ్ చేసేంత అధికారం ఇక్కడి అధ్యక్షుడికి లేదని తెలిపారు. తాను బీజేపీని సపోర్ట్ చేస్తూనే మాట్లాడానని.. పార్టీ సస్పెన్షన్ గురించి తాను ఆలోచించనని... ప్రజల గొంతుకను వినిపించడమే తనకు ముఖ్యమని తెలిపారు.