ప్రమాదాలు... ప్రమాదాలు...

 

ఆదివారం తెల్లవారు ఝామునే మూడు ప్రమాదాలు జరిగాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దగ్గర ఆటో అదుపు తప్పి ఎస్సారెస్సీ కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆటోలో వున్న ఒక మహిళ మరణించింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. అలాగే వరంగల్ జిల్లా జనగామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీదికోడలి గ్రామం వద్ద ఒక వ్యాను బోల్తా పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గోపాలపురం నుంచి ఎంబరామ్‌కి వెళ్తున్న పెళ్ళివారి వ్యాను మహేంద్రతనయ నది వద్ద బోల్తా పడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu