సుధీర్ ఆడియోకి అతడు వస్తున్నాడు

 

ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఆడు మగాడ్రా బుజ్జి". ఈ చిత్ర ఆడియో వేడుకను ఈనెల 30న శిల్పకళావేదికలో గ్రాండ్ గా చేయనున్నారు.ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ సరసన అస్మితా సూద్, పూనమ్ కౌర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్. రెడ్డి, సుబ్బా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా, కృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు.