చైనాలో భూకంపం

 

 

 

చైనాలోని నైరుతి తీరంలోని యువాన్ ప్రావిన్స్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంపధాటికి 43 మందికి గాయాలయ్యాయి. దీంతో యింగ్ జియాంగ్‌లోని 15 టౌన్‌షిప్‌ల్లో సుమారు సుమారు ఒక లక్షా యాభై వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని కమ్యూనిస్టుపార్టీ నేత వాంగ్ జుంకియాంగ్ తెలిపారు. 50మందితో కూడిన సహాయక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మురం చేసినట్లు వాంగ్ తెలిపారు. సిబ్బంది 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల సుమారు 3,390 భవనాలు, ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా.. 18 వేలకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu