ఉత్తరాఖండ్ రాజకీయాల్లో మరో మలుపు.... హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

 

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చి.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా ఉత్తరాఖండ్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్ పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన హైకోర్టు, రాష్ట్ర పాలనలో కేంద్రం జోక్యం అనవసరమని చెబుతూ రాష్ట్రపతి పాలనను రద్దు చేసింది.