సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతి
posted on Oct 18, 2014 3:44PM
నల్గొండ జిల్లాలో ఘోరా రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, సిమి మాజీ అధ్యక్షుడు సలావుద్ధీన్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తన స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహాన్ని హాజరై తిరిగి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హయత్నగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సలావుద్దీన్ మృతి చెందాడు. ఇటీవల బెంగుళూరులో జరిగిన సైనిక్సెంటర్ పేలుళ్ల కేసులో సలావుద్దీన్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి సంవత్సరం కిత్రమే బెయిల్పై విడుదలైన సలావుద్దీన్ అనంతరం సిమీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటూ అంబర్పేటలో ఓ ఫర్నీచర్ షాపును నడుపుతున్నట్లు తెలుస్తోంది.