జగన్ మేనమామ రవీంద్రనాథ్ కి రిమాండ్
posted on Feb 26, 2013 2:40PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సహకార ఎన్నికల్లో ఫోర్జరీకి పాల్పడిన కేసులో కడప కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ రోజు ఉదయం ఆయన కోర్టులో లొంగిపోయారు. రవీంద్రనాథ్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు దానిని వాయిదా వేసింది.
కాగా అంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఉదయం కడప జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయారు. సహకార ఎన్నికల్లో ఫోర్జరీకి పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఛీటింగ్, ఫోర్జరీ కేసు నమోదయింది. దాంతో ఆయన అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని ఆయన ఆరోపిస్తున్నారు.