కృష్ణా పుష్కరాలు..అతి పెద్ద పుష్కర్ ఘాట్


కృష్ణా పుష్కరాలు మరో రెండు నెలల్లో రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్కరాల దృష్ట్యా అతి పెద్ద పుష్కర్ ఘాట్ ను నిర్మించనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి వద్ద పుష్కర ఘాట్లను మంత్రి పుల్లారావు, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.453 కోట్లతో పుష్కరాల పనులు ప్రారంభిస్తున్నామన్నారు. కృష్ణా నదిలో ఏడు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయనున్నామని, భక్తుల సౌకర్యార్థం అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర అతిపెద్ద పుష్కర ఘాట్ ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. జులై 30 నాటికి పుష్కర పనులన్నీ పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాల కంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు పుల్లారావు పేర్కొన్నారు.