జనసేన పార్టీతో జతకట్టలేము.. బీజేపీ ఇంఛార్జ్
posted on Nov 2, 2016 11:55AM
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పూర్తిగా రాజకీయ ప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీకి మద్దతు పలికిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గత ఎన్నికల సమయంలో తమకు మద్దతు మాత్రమే తెలిపారని, ఆయన స్థాపించిన జనసేన పార్టీతో తాము జతకట్టలేదని అన్నారు. తమకు ఏపీ అధికార పార్టీ టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తమ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న ర్యాలీ నిర్వహించనుందని, అందులో తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.