కుష్బూకు హ్యాండిచ్చిన కాంగ్రెస్..

సినీనటి కుష్బూకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది.  మైలాపూర్ స్ధానం నుంచి పోటీ చేయాలని కుష్బూ ఎంతగానో అశించారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మైలాపూర్ నుంచి పోటీ చేస్తుండటంతో కుష్బూని పోటీ పెట్టనున్నారని మరికొందరు విశ్వసించారు. ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న కుష్బూ కాంగ్రెస్ అధిష్టానం వద్ద పావులు కదిపారు. దానితో పాటు ప్రధాన మిత్రపక్షమైన డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు పొంది ఎలాగైనా సీటు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నమే చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన తుది జాబితాలో మైలాపూర్ నియోజకవర్గానికి కరాటే త్యాగరాజన్ పేరును ఖరారు చేసింది. ఊహించని ఈ పరిణామంతో కుష్బూ షాక్‌కి గురయ్యారు.