కెటిఆర్ కు అక్షింతలు
posted on Jun 22, 2012 9:58AM
టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కేసీఆర్ కుమారుడైన కెటిఆర్ కు హైకోర్టు అక్షింతలు వేసింది. నేరపూరిత కోర్టు దిక్కారణ కింద ఆయనకు నోటీసు జారీ చేసింది. కెటిఆర్ వ్యాఖ్యలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలకు నోటీసులు జారీ చేసింది. టి.ఎస్.జి.ఓ. హౌసింగ్ లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని విచారణలో నిరూపితమవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకదశలో రాష్ట్రప్రభుత్వప్రధానకార్యదశి పంకజ్ ద్వివేదిని కోర్టుకు రప్పించాలని కూడా జడ్జి భావించారు. ఈ దశలో కెటిఆర్ ఆ కసుపై నేరపూరిత కోర్తుదిక్కరణ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం డివిజన్ బెంచ్ కు చేరింది. జస్టీస్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కెటిఆర్ కు నోటీసు జారీ చేసింది.