కేంద్రానికి కెసిఆర్ హెచ్చరిక

 

 KCR not compromise on Hyderabad, telangana state, hyderabad, trs, telangana congress

 

 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో హైదరాబాద్ విషయంలో ఏమైనా తేడాలు చేస్తే మరో యుద్ధానికి సిద్ధమని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఇస్తూనే హైదరాబాద్‌పై ఆంక్షలు పెడ్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే తెలంగాణను, ప్రజలను అవమానించినట్టేనని అన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu