వరుస ఆత్మహత్యలు.. కర్ణాటకలో కలకలం..
posted on Jul 8, 2016 4:56PM
కర్ణాటకలో డీఎస్పీ కాలప్ప ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజలు గడవక ముందే మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంగుళూరు డీఎస్పీ గణపతి ఆత్మహత్య చేసుకున్నారు. కొడగు జిల్లా, బెలగావిలోని ఓ లాడ్జిలో పోలీసులు గణపతి మృతదేహాన్ని గుర్తించారు. అంతేకాదు గణపతి రాసిన సూసైడ్ నోటును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన మృతికి బెంగుళూరు అభివృద్ధి, పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి కేజే జార్జ్తో పాటు ఆయన కుమారుడు రాణా జార్జ్లే కారణమంటూ గణపతి సూసైడ్ నోట్లో రాశారు. దీంతో పోలీసుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పోలీస్ అధికారులను అధికారపార్టీ నేతలు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. పోలీస్ అధికారులను వేధించే నేతలను పదవుల నుంచి తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఓ వ్యక్తి అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ కాలప్ప మూడు రోజల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు.