బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

 

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ఏపీ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. రెండు విడతలుగా ఆయన జరిపిన భేటీలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దీనిలో భాగంగానే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్.. ఏపీకి చెందిన నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.