కన్నతల్లిదండ్రులే కూతురికి విషమిచ్చి..


బెంగుళూరులో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులు, సోదురుడే కూతురికి విషమిచ్చి చంపేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నాన్జన్ గూడలో గురుమల్లప్ప(64), మంజుల(48) కు ఒక కూతురు మధు కుమారి, కొడుకు గురుప్రసాద్. అయితే 21 ఏళ్ల మధు కుమారి జయరాం అనే దళిత యువకుడిని ప్రేమించింది. అయితే ఇది ఏమాత్రం ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు మధు కుమారిని చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే మామిడి పండ్లరసంలో పురుగుల మందు కలిపి ఆమెకు ఇచ్చారు. దీన్ని తాగిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. మధు మృతికి కారణమైన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.