జగన్ పై మండిపడ్డ స్పీకర్

పుష్కర తొక్కిసలాట మృతుల సంతాపం తీర్మానం సందర్భంగా వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ మైకులు కట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.దీని పై స్పందించిన స్పీకర్ జగన్ పై అగ్రహం వ్యక్తం చేశారు.సభలో ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని ..సభను,సభావతిని అవమానపరిచేలా మాట్లాడటం తగదని జగన్‌కు సూచించారు.సంతాప తీర్మానాల్లో రాధ్దాంతం సృష్టించడం సభా సంప్రధాయాలకు విరుద్దమన్నారు.జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించేకోవాలని స్పీకర్ సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu