చిలకడదుంపలను క్రమం తప్పకుండా తింటే ఏమవుతుందో తెలుసా..?

  చిలకడదుంపలు చాలామందికి ఇష్టమైన ఆహారం. చాలామంది వీటిని ఉడికించి తినడానికి ఇష్టపడతారు. మరికొందరు నిప్పుల మీద కాల్చి తింటారు.  ఫుడ్ లవర్స్ అయితే చిలకడ దుంపలతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు.  వీటితో టిప్స్,  టిక్కీ, పూర్ణం బూరెలు,  భక్ష్యాలు కూడా చేసుకుని తింటారు.  అయితే చిలకడదుంపలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయట.  అవేంటో తెలుసుకుంటే.. పోషకాలు.. చిలగడదుంపలు ఒక పోషకాల గని అని చెప్పవచ్చు.  అవి మన శరీరానికి ప్రతిరోజూ అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో,  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే విటమిన్ ఎ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  కొల్లాజెన్ ఉత్పత్తి,  చర్మ ఆరోగ్యంలో దాని పాత్రకు ప్రసిద్ధి చెందిన విటమిన్ సి కూడా ఉంటుంది.  ఒక మధ్యస్థ-పరిమాణ చిలగడదుంప  అంటే సుమారు 130 గ్రాముల చిలకడదుంపలో పోషకాలు ఇలా ఉంటాయి. విటమిన్ ఎ..  రోజువారీ అవసరమైన దానికంటే  400% కంటే ఎక్కువ విటమిన్-ఎ ఉంటుంది.  విటమిన్ సి.. రోజువారీ అవసరమైన దానిలో  25% లభిస్తుంది ఫైబర్.. 4 గ్రాములు ఉంటుంది.  ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది పొటాషియం.. గుండె ఆరోగ్యానికి,  రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం మెగ్నీషియం..  ఒత్తిడిని తగ్గించడానికి,  కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇంకా ఇందులో ఐరన్,  బి విటమిన్లు ఉంటాయి. ఇది  మొత్తం శరీర శక్తి స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీటా-కెరోటిన్ అనేది యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం లో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. ఇది చిలగడదుంపలలో సమృద్ధిగా ఉంటుంది.   ఈ విటమిన్ కంటి చూపు మెరుగ్గా ఉండటానికి  రేచీకటి వంటి  వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పట్లో చాలామంది  కంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  ఇలాంటి వారు స్వీట్ పొటాటోను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.  శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు ఏదైనా సెల్యులార్ దెబ్బతినకుండా శరీరం  రక్షణను బలోపేతం చేస్తాయి. స్వీట్ పొటాటోను తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుుతంది. స్వీట్ పొటాటోలో డైటరీ ఫైబర్ ఉంటుంది.  జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ కంటెంట్ మలాన్ని మృదువుగా చేస్తుంది.  మలబద్దకం సమస్య రానీయదు. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.                                 *రూపశ్రీ.

ఈ డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తింటే చాలు.. శరీరానికి ప్రాణం పోస్తాయి..!

  డ్రై  ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. మాంసాహారం తినని వారికి  ప్రోటీన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వారు డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల కొద్దో గొప్పో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.   కొన్ని డ్రై ప్రూట్స్ ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే పోషకాహారంతో బలహీనంగా ఉన్న శరీరానికి తిరిగి ప్రాణం పోస్తాయి.  శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.  రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. బాదం.. ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన చాలామంది  రాత్రి నానబెట్టిన బాదం పప్పును ప్రతి రోజూ ఉదయం తీసుకుంటూ ఉంటారు. బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  ఇంకా ఇందులో ప్రోటీన్, పైబర్ కూడా ఉంటాయి.  బరువును అదుపులో ఉంచుతుంది. ఎండుద్రాక్ష.. ప్రతిరోడూ ఎండుద్రాక్ష తింటే శరీరానికి అమితమైన బలం లభిస్తుంది.  ఎండుద్రాక్షను కూడా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది.  పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.  మలబద్దకాన్ని నివారిస్తుంది.  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. వాల్ నట్స్.. వాల్ నట్స్ కండరాలను బలపరుస్తుంది.  వాల్ నట్స్ మీద సన్నని పొర ఉంటుంది.  దీన్ని తీసేసి తినాలి. అందుకే వాల్ నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే సన్నని పొర తీసేసి తినాలి. కనీసం రోజుకు ఒక వాల్ నట్ తీసుకుంటే మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తి వంతమైన డ్రై ప్రూట్స్.  అంజీర్ పండ్లు తాజాగా కూడా లభ్యమవుతాయి.  కానీ తాజా పండ్ల కంటే డ్రై అంజీర్ చాలా మంచివి.  అంజీర్ పండేకొద్ది తీపిదనం పెరుగుతుంది.  డ్రై అంజీర్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి.  ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఎముకలు,  కండరాలు బలపడతాయి.  ఎముకలు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఖర్జూరం.. ఖర్జూరం కూడా శక్తి వంతమైన డ్రై ప్రూట్.  ఖర్జూరాలు తక్షణ శక్తిని ఇస్తాయి.  వీటిని నేరుగా తీసుకోవచ్చు.  ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత తొలగించడంలో బాగా సహాయపడుతుంది.  శరీరానికి ఐరన్ ను అందించడం ద్వారా  హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది. పై డ్రై ప్రూట్స్ ను రాత్రి నానబెట్టి  ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం లేదా.. స్నాక్స్ సమయంలో అనారోగ్యకరమైన చిరుతిండికి బదులు వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారుతుంది.                                             *రూపశ్రీ.

మీరు లివర్ లేదా ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా... అయితే మీరు  ప్రమాదం లో ఉనట్టే 

  లివర్ వ్యాధి మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది.అని ఒక పరిశోదనలో గుర్తించారు.లివర్ వ్యాధి సహజంగా  హెపటైటిస్ లేదా ఆల్కాహాల్ కు సంబంధం ఉంది.ఊబకాయం.డయాబెటిస్ వల్ల మీ లివర్ పాడై పోతుంది. వాస్తవానికి ఫ్యాటి లివర్ వ్యాధి పెరిగితే వ్యక్తులు చనిపోతారు.అని ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఫ్యాటి లివర్ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ మెల్లగా మిమ్మల్ని సైలెంట్ గా చంపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటి లివర్ వల్ల నష్టం కావడమే కాదు మీరు దీర్ఘకాలం పాటు సమస్యలు తప్పవని ఈ అంశం పై అమెరికాకు చెందిన డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెన్ని క్లార్క్ హక్కిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డైరెక్టర్ జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ బాల్టి మోర్ ఎం డి   బృందం జరిపిన  పరిశోదనలు లివర్ వ్యాధి వృద్ధి చెందుతూఉంటుంది.లివర్ వ్యాధి ఒక్క సారి వస్తే కొన్ని  ఏళ్ల పాటు  వృద్ధి చెందు తూనే ఉంటుంది.  లివర్ పై వచ్చే చారలు,మచ్చల వల్ల చాలామంది చనిపోతున్నారని డాక్టర్ క్లార్క్  అన్నారు. శరీరంలో ఎక్కువ శాతం కొవ్వు పెరిగి పోయి లివర్ లో నిల్వ ఉంటుందో దీనికారణం గానే ఇంఫ్లామేషణ్ తో పాటు స్కార్స్ వస్తాయని క్లార్క్ అన్నారు. కొవ్వు పెరగడానికి అధికంగా ఆహారం తీసుకోవడమే గీస కూడా కావచ్చని క్లార్క్ పేర్కొన్నారు.అధికంగా కార్బో హైడ్రేడ్స్ తీసుకోవడం వాళ్ళ మేతాబాలిక్ సిస్టం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతాయని.అది ఫ్యాట్ ను పెంచుతాయాని అన్నారు. ప్రపంచం లో ప్రతి నలుగురిలో ఒకరు  ఫ్యాటి లివర్ సమాస్యతో బాధ పడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  లో ఒక నూతన పరిశోదన ద్వారా అధునాతన ఫ్యాటిలివర్ వ్యాధి వల్ల హెపటైటిస్ సి ప్రాధాన కారణ మనిపేర్కొన్నారు.  కివేర్ పై స్కార్ మచ్చ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందేన.... మానవులలో ఫ్యాటి లివర్ డిసీజ్ కు మేతాబాలిక్ సిండ్రోం అని డాక్టర్ స్క్రత్ ఫ్రైడ్ మెన్ డేఒన్ హేపటిస్ట్ అన్నారు. లివర్ పై ఒక్కసారి సచార్ వాస్తే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిందే. మెటా బాలిక్ సిండ్రోం కు అనారోగ్య సమాస్యలకు  మూలమని తేల్చారు.దీనివల్ల హార్ట్ డిసీజ్,స్ట్రొక్,టైప్ 2 డయాబెటిస్ దీనివల్ల బిపి,హై బ్లడ్ షుగర్,వీటి వల్ల కొవ్వు  అదనంగా చేరి,కొలస్ట్రాల్ లో హెచ్చుతగ్గులు,పొట్ట పెరగడం.వంటివి ఉంటాయి. లివర్ పెరుగుతున్నాయి అంటే ఊబ కాయం టైపు 2 డయాబెటిస్ మేతాబాలిక్ సిండ్రోం లివర్ డిసీజ్ కు కారణంగా  చెప్పవచ్చు. ఈ అంశం పై పరిశోదనలు జరిపిన డాక్టర్ల బృందం 18౦౦ ఫ్యాటి లివర్ తో సంబంధం ఉన్న వారిని పరిశీలించారు.  నాలుగు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. లివేర్ లో  స్కార్రింగ్  అభివృద్ధి చెందడానికి కారణం లివర్ వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నట్లు అధ్యయనం లో తెలుసుకున్నారు.  అంతర్గతంగా రక్త  శ్రావం  అదనపు రాసాయనాలు మానసికంగా గందరగోళం గాఉంటుంది .శరీరంలో రక రకాల రాసయనాలు మెదడు  పై ప్రభావం చూపుతాయి.ఫ్యాటి లివర్ ఉంటె టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.కిడ్నీ పనితీరులో మార్పు వస్తుంది. అని పరిశోదనలో తెలిపారు.లివర్ సమస్యల వాళ్ళ ఫ్యాటిలివర్ వల్ల 7% మరణాలాను ఈ బృందం గుర్తించింది. ఊబకాయం,డయాబెటిస్,ఉన్నవారిలో ఫ్యాటిలివేర్ 2౦%  నుండి 3౦ % స్కారింగ్ వృద్ధి చెందుతోంది.కొందరికి ఫ్యాట్ మాత్రమే  ఉంటె కొందరిలో ఇంజురీస్ ఉంటాయి.ఫ్యాటి లివర్ కు వెయిట్ లాస్ చికిత్స తో నియంత్రిన్చాగాలిగారు.  అయితే ఫ్యాటి లివర్ నియంత్రణకు లోని ఫిబ్రోనోర్ మందును ఎక్కువ మోతాదులో వాడినట్లు తెలుస్తోంది. బెల్జియంకు చెందినా బ్రొకుఒ పియర్  ఈ అంశాన్ని శాస్త్రజ్ఞులు తెలిపారు. ప్రాధమిక స్థాయిలో ఫ్యాటి లివర్ లక్షణాలు వస్తే తక్షణం నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఊబాకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్త పాడడం కార్బో హైడ్రేడ్స్ తగ్గించడం వాళ్ళ కొవ్వు పెరగకుండా జాగ్రత్తలు  తీసుకుంటూ నిర్లక్ష్యం చేయవదని మరణానికి గురికవద్దని వైద్యులు సూచించారు.                                               

చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులు వాడితే అంతే సంగతులు!

ఇప్పట్లో అనారోగ్యాలు ఎక్కవ అవ్వడమే కాదు ఆరోగ్య స్పృహ కూడా ఎక్కవగానే ఉంది అందరిలో. చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గట్టు ఆహారం దగ్గర నుండి అన్ని విషయాలలో మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అవుతున్నామని అనుకుంటూ చాలామంది  పొరపాట్లు చేస్తున్నారు. వాటిలో చక్కెరను నియంత్రించడం, దాని స్థానంలో కృత్రిమ చక్కెరలు ఉపయోగించడం ప్రధానమైనది. తీపిని ఇష్టపడని వారు ఉండరు. కానీ తీపి తింటే లావు అవుతామని, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని చాలామంది అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీన్ని వల్ల చక్కెరను నియంత్రించామని, ఆరోగ్యం  బాగుంటుందని అనుకుంటారు. పైపెచ్చు తీపి తిన్నామనే  తృప్తి కూడా కలుగుతుంది. అయితే ఇలా కృత్రిమ చక్కెరలు తీసుకోవడం  చాలా ప్రమాదమని తెలుస్తోంది. అసలు కృత్రిమ చక్కెరలు శరీరానికి ఎంత చేటు చేస్తాయి? దీని వల్ల కలిగే ప్రమాదాలేంటి తెలుసుకుంటే దీని నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినవి కృత్రిమ చక్కెరలు. సాధారణంగా వీటిని డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.  చక్కెర తింటే లావు అవుతాం అనే అపోహ ఉన్నవారు కూడా దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల బరువు పెరగమని, ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటారు. అయితే ఇది చాలా అవాస్తవం.  సాధారణంగా కృత్రిమ చక్కెరలుగా అస్పర్టమే, సాచరిన్. సుక్రలోజ్, మాంక్ ప్రూట్, స్టెవియా, సార్చిటాల్, జిలిటాల్, ఎంథ్రిటాల్ వంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా కృత్రిమ చక్కెరలను  సాచరిన్ అనే పదార్థంతోనే ఎక్కువ తయారుచేస్తారు. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. తీపి తిన్న అనుభూతిని ఇస్తుంది. కానీ.. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఈ కారణంగా ఉబకాయం కూడా ఎదురవుతుంది. ఇకపోతే ఈ కృత్రిమ చక్కెరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆహారం తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది బరువును పెరగడానికి దారితీస్తుంది. అంతే కాదు ఎప్పుడైనా స్వీట్లలో అధికంగా కృత్రిమ చక్కెరలను వినియోగించడం వల్ల విరేచనం, వికారం, అపానవాయువు వంటి సమస్యలు ఏర్పడతాయి. కృత్రిమ చక్కెరగా ఉపయోగించే అస్పర్థమే అధిక ఉష్ణోగ్రత వద్ద పార్మిక్ ఆమ్లంగా  విచ్చిన్నమవుతుంది. స్వీట్ల తయారీలోనూ, కాఫీ, టీ లలోనూ వేడి మీద వీటిని జోడించడం ప్రమాదం. ఈ కారణంగా ఇది అలర్జీలకు కారణమవుతుంది. అలాగే అధికమొత్తంలో అస్పర్థమేను తీసుకోవడం వల్ల పెద్దలలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఒకటిన్నరెట్లు  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రొమ్ము క్యాన్సర్, ఉబకాయం చాలా సులువుగా వస్తాయి. ఫినైల్కెటోనూరియా అనే సమస్య ఉన్న వ్యక్తులు అస్పర్టమేకు దూరంగా ఉండాలి, వీరు అస్పర్టమేలో ఉండే  ఫెనిలాలనైన్  అనే అమైనో ఆమ్లంను జీవక్రియ చేయలేరు. ఫెనిలాలనైన్ అధికంగా ఉండటం వల్ల మెదడులో మూర్ఛలు వస్తాయి. ఇలా కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశమే ఎక్కువ.                                                               *నిశ్శబ్ద.  

పూల టీలతో భలే ఆరోగ్యం..

పువ్వులు మనసుకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి. చాలామంది పువ్వులను ఇంటి అలంకరణ కోసం,  దేవుడి పూజ కోసం వాడతారు. ఇక ఆడవాళ్లకు పూలు తెచ్చిపెట్టే అందం అంతా ఇంతా కాదు.. అయితే పువ్వులు మగువల అందాన్ని, ఇంటి అందాన్ని, దేవతామూర్తుల చెంత చేరి దేవతామూర్తుల రూపాన్ని మెరిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి.  జపనీస్, చైనా ప్రజలు పువ్వులను ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఎప్పటి నుండో వాడుకలో ఉంది. భారతీయ ఆయుర్వేదంలో కూడా చాలా రకాల పువ్వుల ను ఔషదంగా  వాడతారు. అయితే  కొన్ని రకాల  పువ్వలతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యం భేష్ గా ఉంటుంది. ఇంతకీ ఆరోగ్యం చేకూర్చే ఆ టీలు ఏవో తెలుసుకుంటే.. మందార టీ.. మందారలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్,  విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. చాలా అధ్యయనాలలో  మందార సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని తేలింది.  ఇప్పటికే యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్స్‌లో ఉన్నవారు  మందార టీని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. చమోమిలే టీ.. ఎండిన చమోమిలే లేదా చేమంతి పువ్వులను వేడి నీటిలో వేసి చమోమిలే టీని తయారుచేస్తారు. ఫలితంగా సున్నితమైన రుచితో సువాసన కలిగిన టీ చాలా ప్రశాంతతను ఇస్తుంది. చమోమిలే టీ మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. "కెఫిన్ టీలకు బదులు చమోమిలే  రాత్రిపూట  తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది. బ్లూ టీ.. బ్లూ టీని శంఖు పుష్పాలతో తయారుచేస్తారు. దీని కోసం తాజా శంఖు పుష్పాలు అయినా వాడవచ్చు లేదా.. ఎండిన శంఖు పుష్పాలు అయినా ఉపయోగించవచ్చు. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి యవ్వనంగా మారుస్తాయి. బ్లూ టీలో ఉండే ప్లేవనాయిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. బ్లూ టీలో ఉండే క్యాటెచిన్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజ్ టీ.. సాధారణంగా వాడే టీలో ఎండిన గులాబీ రేకులను జోడించుకోవచ్చు. లేదంటే తాజా గులాబీ రేకులను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ రేకులను నేరుగా సాధారణ నీటిలో ఉడకబెట్టడం ద్వారా గులాబీ టీని తయారు చేసుకోవచ్చు.  గులాబీ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీ గుణాలు ఉంటాయి.  రోజ్ టీ కూడా జీర్ణప్రక్రియను ప్రోత్సహిస్తుంది.   లావెండర్ టీ.. లావెండర్ టీ సాధారణంగా సోపులు, పెర్ప్యూమ, ఎయిర్ ఫ్రెషనర్ మొదలైన వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు.  కానీ లావెండర్ టీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లావెండర్ మానసిక స్థితిని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. నరాలకు స్వాంతన చేకూరుస్తుంది. మంచి నిద్రకు, చర్మ ఆరోగ్యానికి  చాలా మంచిది.                                                   *రూపశ్రీ.

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది?

  శరీరం ఆరోగ్యంగా ఉండడానికి అన్ని అవయవాలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం.  చాలామందికి శరీరంలో రక్తం తక్కువ ఉందని అంటుంటారు. నిజానికి రక్తం తక్కువ ఉండటం అంటూ ఏమీ ఉండదు. కానీ రక్తంలో హిమెగ్లోబిన్ స్థాయిలు తక్కువ ఉంటాయి.    రక్తంలో హిమోగ్లోబిన్ లేకపోవడాన్ని రక్తహీనత అంటారు.   రక్తహీనత అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా మగవారిలో కంటే ఆడవారిలోనే ఈ సమస్య ఎక్కువ.  భారతదేశంలో అధిక శాతం మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని వైద్య పరిశోధనలు, సర్వేలు  వెల్లడిస్తున్నాయి. అందుకే రక్తహీనత ప్రమాదం భారతీయ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది మన ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రోటీన్. దాని లోపం కారణంగా అవయవాలకు ఆక్సిజన్ ప్రసరణ లోపిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్  దీర్ఘకాలంగా లోపిస్తే  రక్తహీనతకు కారణమవుతుంది, ఇది వివిధ రకాల ఆరోగ్య దుష్ప్రభావాలను కలిగిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఆహారంలో పోషకాలు లేకపోవడం, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, మహిళల్లో రుతుక్రమం వంటి కారణాల వల్ల కూడా  హిమెగ్లోబిన్ తగ్గడానికి కారణం అవుతుంది. అయితే హీమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉంటే ఏం జరుగుతుందంటే.. హిమోగ్లోబిన్ లెవల్.. పురుషులు,  స్త్రీలలో హిమోగ్లోబిన్  సాధారణ స్థాయి భిన్నంగా ఉంటుంది. పురుషులకు 14.0 నుండి 17.5 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి.  మహిళలకు  12.3 నుండి 15.3 గ్రా/డిఎల్ మధ్య ఉండాలి. పురుషులలో 13 గ్రా/డిఎల్ కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా,  మహిళల్లో 12 గ్రా/డిఎల్ కంటే తక్కువగా ఉన్నా  హానికరంగా పరిగణిస్తారు. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల అలసట, బలహీనత,  తలనొప్పి సమస్య తరచుగా ఉంటుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా  అలసిపోయినట్లు,  బలహీనంగా ఉన్నట్లు  అనిపించవచ్చు. తేలికపాటి శారీరక శ్రమ చేసినా  బలహీనంగా అనిపిస్తుంది. రక్తహీనత ఉన్నవారిలో    తలనొప్పి చాలా  సాధారణ సమస్యగా ఉంటుంది. ఇవి దీర్ఘకాలం ఉండటం ప్రమాదం. శరీరంలోని కణజాలాలకు,  అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడంలో,  కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపడంలో హిమోగ్లోబిన్  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . శరీరంలో హిమోగ్లోబిన్ సాధారణం కంటే తక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యం  ప్రభావితమవుతుంది. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు హృదయ స్పందన రేటు సక్రమంగా లేకపోవడం, హృదయ స్పందనలు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వంటి సమస్యను ఎదుర్కొంటారు. హృదయ స్పందన రేటు సక్రమంగా లేకుంటే అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ శరీరంలోని కణజాలాలకు అవయవాలకు సరిగా చేరదు. వాస్తవానికి, తక్కువ స్థాయి హిమోగ్లోబిన్ కారణంగా ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే  సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా ఏ కొద్దిగా పనిచేసినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మందికి రక్తహీనత కారణంగా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కేవలం శరీరంలో రక్తహీనత కారణంగానే సంభవిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హిమోగ్లోబిన్ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఐరన్ ట్యాబెట్లు,  సిరప్ లు కూడా తీసుకోవచ్చు.                                                          *రూపశ్రీ.

నిద్రలోనే గుండెపోటు ప్రమాదాలు.. దీని లక్షణాలు ఏంటంటే..

ప్రపంచంలో ఎక్కువమంది ప్రాణాలు తీసే జబ్బు గుండెపోటు. కరోనా తరువాత ఈ గుండె సంబంధ సమస్యలు మరింత పెరిగాయి. గుండె బలహీనం కావడం, తొందరగా అలసిపోవడం, ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలు చాలామందిలో ఎక్కువయ్యాయి.  ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, చక్కని ఆహారపు అలవాట్లు కలిగినివారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అది కూడా సైలెంట్ అటాక్ లో చిక్కుకుంటున్నారు. గుండె ఆగిపోవడాన్ని వైద్య పరిభాషలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా అంటారు. ఇది  గుండె శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు వచ్చే పరిస్థితి.  హార్ట్ ఫెయిల్యూర్ అకస్మాత్తుగా రావచ్చు.  ఎందుకంటే అప్పటికి  గుండె బలహీనమై ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్  లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. నేటికాలంలో ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని అన్ని సమయాలలో గమనించుకోవడం ఎంతో ముఖ్యం.  రాత్రి నిద్రపోతున్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి సమస్యలు కొన్ని వస్తుంటాయి. వీటి లక్షణాల గురించి తెలుసుకుంటే.. శ్వాస వేగంగా ఉండటం..  శ్వాస వేగంగా ఉండటం అనేది హార్డ్ ఫెయిల్యూర్ కు దారితీసే లక్షణం. దీన్ని రాత్రి నిద్రించే సమయాల్లో గమనించవచ్చు.  దీనిని పార్క్సిస్మల్ నాక్టర్నల్ డిస్‌ప్నియా (PND) అంటారు. ఇది సాధారణంగా గాఢ నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల తర్వాత జరుగుతుంది.ఈ సమస్య ఉన్న వ్యక్తి ఉబ్బరంతో మేల్కొంటాడు.  ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు  ఊపిరి పీల్చుకోవడానికి కూర్చోవడం లేదా నిలబడటం చాలా ముఖ్యం.  నిద్రపోతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు.  అది కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం . గుండెదడ.. భయంగా ఉన్నప్పుడు గుండె దడగా ఉంటుంది. ఆ పీలింగ్ చాలామంది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెంది ఉంటారు. అయితే  గుండె ఆగిపోయేముందు వ్యక్తుల హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని టాచీకార్డియా అంటారు. ఇది ఒక నిమిషంలో గుండె 100 సార్లు కంటే ఎక్కువ కొట్టుకునే పరిస్థితి . ముఖ్యంగా నిద్రలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్తగా ఉండకూడదు. దగ్గు.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. హార్ట్ ఫెయిల్యూర్  ప్రాధమిక దశ శ్వాసలో గురక ప్రారంభమవుతుంది. ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, బ్రోన్కియోల్స్ వాటిని దూరంగా ఉంచే ప్రయత్నంలో కుంచించుకుపోతాయి.  దగ్గుతో పాటు గురక కూడా వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య అనుభవంలోకి వస్తుంటుంది.  ఈ పరిస్థితిని కార్డియాక్ ఆస్తమా అని పిలుస్తారు, దీనిలో ఒక వ్యక్తి నోటి నుండి నురుగు, గులాబీ రంగులో ఉండే కఫం కూడా బయటకు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే , అది గుండె వైఫల్యం యొక్క లక్షణం. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి, దిండు సహాయం తీసుకుని నిటారుగా కూర్చోవాలి. ఈ పరిస్థితిని ఆర్థోపెనియా అంటారు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అకస్మాత్తుగా మెలకువ రావడం.. రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొలపడం కూడా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ ఫెయిల్యూర్  ప్రధాన లక్షణం. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి కూడా ఎదురవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో చికిత్స ఆలస్యం మరణానికి కూడా దారితీస్తుంది. ఎవరైనా సరే నిద్రిస్తున్నప్పుడు పైన పేర్కొన్న ఏవైనా లక్షణాలు ఎదుర్కొంటుంటే వెంటనే చికిత్స తీసుకోవాలి.హార్ట్ ఫెయిల్యూర్ అనేది అత్యవసర సహాయం అవసరమయ్యే పరిస్థితి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెడుతుంది.                                                  *నిశ్శబ్ద.  

టిఫిన్ కి నాగా పెడుతున్నారా?

  ఉరుకులు పరుగుల జీవితం. పొద్దున లేచిన దగ్గర్నుంచి పొద్దుపోయేవరకూ ఉరుకులూ పరుగులు. టైమ్ కి ఆఫీస్ కెళ్లాలి. పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. త్వరత్వరగా తెమలాలి. ఎంత తొందరగా లేచినా రోజూ లేటైపోతోంది. జీవితమంతా గాభరా.. ఇంత హడావుడిలో పడితే ఎవరికి మాత్రం టిఫిన్ తినాలనిపిస్తుంది చెప్పండి. టైమ్ కి ఆఫీస్ కెళ్లాలన్న ధ్యాసలో పడపోయి చాలామంది పొద్దున్నే టిఫిన్ తినడం మానేస్తున్నారు. ఆలస్యంగా లేచే అలవాటున్న పిల్లలుకూడా టిఫిన్ తినకుండానే రోజూ స్కూల్ కెళ్లిపోతున్నారు. దీంతో పొద్దున్నే కడుపులో ఎసిడిటీ. మంటని తగ్గించుకోవడానికి తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పొట్టలో ఏదో ఒకటి పడేయడం. దానివల్ల ఎసిడిటీ మరింతగా పెరగడం.. చక్రం తిరిగీ తిరిగీ ఇలాగే రోజులు గడిచిపోవడం. సవ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థని మనంతటమనమే దెబ్బకొట్టుకోవడం.. మామూలైపోయాయ్. కనీసం డెబ్భైశాతం కుటుంబాల్లో స్థిమితంగా కూర్చుని టిఫిన్ చేసే అలవాటు పూర్తిగా కనుమరుగైపోతోందని సర్వేలు చెబుతున్నాయ్. రెండు వేల మందిని ప్రశ్నిస్తే ఈ విషయాలు బైటికొచ్చాయ్. లండన్ మాత్రం చాలామంది ఇలాంటి దురలవాటు తమ పాలబడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఎంత ఆలస్యమైనా తప్పని సరిగా టిఫిన్ చేసే బైటికి బయలుదేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. అవునుమరి.. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న సంగతి మనకంటే వాళ్లకే ఎక్కువగా తెలుసినట్టుంది.  

వర్షాకాలంలో తులసి ఆకులు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

  తులసి ఒక ఆయుర్వేద మూలిక.  తులసి మొక్కను ఔషధంగానూ,  ఆధ్యాత్మికతలోనూ భాగం చేస్తారు.  ముఖ్యంగా హిందువులు తమ ఇళ్లలో తులసిని దైవంగా పూజించడం చూస్తునే ఉంటాం.  అయితే ఈ తులసి ఆరోగ్యం కోసం ఎక్కువగా వినియోగించ బడుతుంది. తులసితో చేసే వైద్యం చాలా శక్తివంతమైనది.  ఈ వర్ష కాలంలో తులసి ప్రతి ఇంటి దగ్గర ఉండాల్సిందే.. దీంతో కలిగే ప్రయోజనాలేంటంటే.. తులసిని రోజూ ఉదయాన్నే తీసుకునే వారు ఉంటారు.  తులసి ఆకులను నేరుగా నమిలి తినేవారు మాత్రమే కాకుండా వివిధ రూపాలలో కూడా తీసుకుంటారు. తులసి టీ.. తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం,  తులసి టాబ్లెట్లు వాడటం చేస్తారు.  అయితే తులసిని రోజూ తీసుకుంటే మెదడు బాగా పని చేస్తుందట. ఇది మెదడుకు పదును పెడుతుందట. నేటి కాలంలో దంతాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారు. తులసి ఆకులను మిరియాలతో జోడించి పంటి కింద ఉంచుకుంటే పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తరచుగా తల నొప్పితో బాధపడేవారు తులసి నూనెను ఒక రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి.  ఇది తలనొప్పి నుండి అద్బుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది.  అలాగే నాసికా రంధ్రాలను,  శ్వాస నాళాలను కూడా రిలాక్స్ చేస్తుంది. జలుబు, దగ్గు కారణంగా గొంతు నొప్పిగా ఉంటుంది.  దీని వల్ల గొంతు బొంగురుపోవడం చాలా మందికి అనుభవంలోనే ఉంటుంది.  ఇలాంటి పరిస్థితిలో తులసి ఆకులను రసం తీసి తాగితే గొంతునొప్పి గొంతు బొంగురు పోవడం వంటివి తగ్గుతాయి. తలలో పేను సమస్యలు,  తలలో చుండ్రు వంటివి ఉంటే తులసి నూనెను తలకు రాసుకోవచ్చు.  ఇది జుట్టు సంబంధ సమస్యలను చక్కగా తగ్గిస్తుంది. తలలో పేనులు చచ్చిపోతాయి. చెవులలో నొప్పి లేదా వాపు ఉంటే ఒక చుక్క గోరువెచ్చని తులసి రసాన్ని చెవుల్లో వేయాలి.  దీని వల్ల చెవి నొప్పి సమస్యలు తగ్గుతాయి. దగ్గు సమస్య అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో జ్యూస్ తయారు చేసి తాగాలి.  ఇది అన్ని రకాల దగ్గుల నుండి ఉపశమనం అందిస్తుంది. సైనసైటిస్ సమస్య కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటోంది.  ఈ సమస్య ఉన్న వారు తులసి ఆకులను వాసన చూస్తుంటే సైనసైటిస్ సమస్య నుండి ఉపశమనం ఉంటుంది. విరేచనాల సమస్యతో ఇబ్బంది పడేవారు పది తులసి ఆకులను,   ఒక గ్రాము జీలకర్రను తీసుకోవాలి.  ఈ  రెండింటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని తేనెతో కలిపి తినాలి.  ఇలా తింటే విరేచనాల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా సమస్య వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ.   ఆస్తమా తో ఇబ్బంది పడేవారు తులసి పొడి, మంజరి,  తేనె కలిపి తాగితే ఆస్తమా సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.                                              *రూపశ్రీ.  

మన కంటిని బట్టి మన ఆరోగ్యం తెలుసుకోవచ్చు...

  సర్వేంద్రియానాం నయనం ప్రాధానం అంటే మనకు కళ్ళే కీలకం సమస్త సృష్టిని చూసేది మన కళ్ళే. మనకంటికి కనపడిన వెంటనే మనసు స్పందిస్తుంది. అయితే కళ్ళు ఉండీ నిజాన్ని చూడలేని వాళ్ళ కన్నా. కళ్ళు లేనువాళ్ళే స్పందించే తీరు జీవితం లో వేరుగా ఉంటుంది. వారి జీవితం సవాళ్లతో కూడుకుని ఉంటుంది.సవాళ్ళను అధిగమిస్తూ మేము ఎవరికీ తీసిపోము అన్నట్లుగా తమ జీవితాన్ని పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉంటారు అంధులు అయితే అయితే కళ్ళను చూసి మనకు ఉన్న వ్యాధులను గుర్తించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు.కంటిద్వారా మనకు ఉన్న వ్య్సధులను ఖచ్చితంగా అంచనా వేయవచ్చని. అవికూడా ప్రస్తుతం ఉన్న వ్యాధులను. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా గుర్తించవచ్చని. ఇది భారతీయులు ముఖ్యంగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన నాడీ వైద్యం లో ప్రస్తావించారని పెర్కిన్నారు.మన కళ్ళను బట్టి మన అనారోగ్య సమస్యను గుర్తించవచ్చు. చలామంది హెల్త్ చెకప్ పేరుతో ఆరోగ్యం పై హెల్త్ చెకప్ అందరూ చేయించు కోలేరు.అయితే వారి వారి కళ్ళను చూసి వారి ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం సాధ్యమని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. మీకళ్ళు నిప్పుకనాళ మాదిరిగా ఎర్రగా ఉన్నాయా... కొందరి కళ్ళు నిప్పుకనాళ లాగా ఎర్రగా ఉంటాయి. వైద్యుడు పరీక్షించి చూస్తే రెటీనా పైన చిన్న చిన్న రక్తకణాలు కనబడతాయి.దీనికి కారణం అధిక రక్త పోటు అధిక రక్త పోటు కారణంగా కంటిలోని నరాలు ఎర్రగా మారుతాయి. కొన్ని సార్లు అవి పగిలిపోవడం కూడా జరగ వచ్చు. దాంతో కళ్ళు ఎర్రగా కనబడతాయి. అయితే ఈ విషయం నాలుగో వంతు మందికి తెలియదు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుండె పోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువేఅని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కళ్ళు ఎర్రబడితే ఆ ఏం జరుగుతుంది లె అని వదిలి వేయకండి ఇది హై బిపి కార్డియోక్ ఇండికేషన్ అని జాగ్రత పడాలి అని అంటున్నారు నిపుణులు. కళ్ళు తెల్లగా పాలిపోయి నట్లు ఉంటె.. దీనిని ఎనిమియా సమస్యగా పేర్కొన్నారు.అంటే రక్త హీనత అని చెప్పవచ్చు. ఇది మీ అనారోగ్య సమస్యగా చెప్పవచ్చు.శరీరంలో సరైన పోషకాలు లేనండువల్లె శరీరంలో రక్త హీనత వస్తుందని ఒక్కోసారి రక్త హీనత మరిన్ని సమస్యలకు దారితీయ వచ్చు. కళ్ళు ఎర్రగా రక్తం కారినట్లు ఉంటె.. ఒక్కొకరిలో కళ్ళలో రక్తం కారినట్లు ఉంటాయి. రక్తంలో ప్లేటి లెట్స్ తగ్గడం వల్ల ఇలా కనిపిస్తుంది. కను గుడ్డు పోటు రావడం.. శరీరంలో డీ హైడ్రేషన్ వల్ల లేదా మెడ నరాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కనుగుడ్డు ముందుకు వస్తుంది. కంటి రెప్పల పై ఉండే హెయిర్ ఊడిపోవడం.. కనురెప్పల పైన ఉండే జుట్టు ఊడి పోవడం అంటే ఇది క్యాన్సర్ కు ఇండికేషన్ గా చెప్పవచ్చు.కనురెప్పలు ఒక్కోసారి డ్రై కావడం--కంటి నుండి ఎక్కువనీరుకారడం. సైనస్ లేదా నోజేల్ సూబ్ బ్లాక్స్ ఉండడం. ఈ కారణంగా సైనస్ సమస్యలు ఉంటె ఇలాంటి సమస్యలు వస్తాయి. కళ్ళు పెద్దవి గా కనిపించడం.. శరీరంలో హార్మోన్స్ సమస్యల వల్ల లేదా సమతౌల్యం లేదా థైరాయిడ్ వల్ల కళ్ళు ముందుకు వచ్చినట్లు. పెద్దవిగా కనిపిస్తాయని నిపుణులు విశ్లేషించారు.కంటి వెనుక భాగం లో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది లేదంటే రెటీనా చిన్న చిన్న నీటిబొట్లు కనబడుతుంది.ఇలాంటి వారిలో టైపు 2 డయాబెటీస్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది. కళ్ళు పసుపు పచ్చగా ఉంటె.. కొందరి కళ్ళు పసుపు పచ్చగా కనిపిస్తే దాని ఆర్ధం కాలేయ సమస్య ఉందని అంటున్నారు. కళ్ళు ఇలా మారిపోడానికి కాలేయం పనితీరులో తేడా ఉండడమే. అందువల్ల వెంటనే వైద్యుడిని సలహా తీసుకుని సంప్రదించడం ఉత్తమం సమస్యనుండి బయట పడగలం.దీనిని వైద్య పరిభాషలో లివర్ బైల్ సేక్రేషణ్ ఎక్కువకవాడమని వైద్యులు నిర్ధారించారు. కళ్ళు పొడి బారడం -లేదా అయిడ్రై నెస్.. సహజంగా శరీరానికి అందాల్సిన విటమిన్ ఏ సరిగా అందక పోవడం జిరాప్ గాల్దిమియా అని అంటారు. కళ్ళలో నీరు కారడం.. కండ్లకలకఅంటే కండ్ల లో వచ్చ్ఘే ఇన్ఫెక్షన్ సహజంగా వర్స్ఘాకాలం లో వచ్చే సమస్య.ఇది ఒక్కోసారి ఒకరి నుండి మరొకరికి సోకే అవకాసం ఉంది కాబట్టి కండ్లకలకకు దూరంగా ఉండడం అవసరం సకాకంలో వైద్యుని సూచన మేరకు కంటి లో డ్రాప్స్ వాడాలేతప్ప సొంత వైద్యం చేయరాదని అలా చేస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. కండ్లు గడ్డ కట్టి నట్టుగా ఉండడం.. ఐ స్టేయ్స్ అంటే కండ్లలో గడ్డలు.. కంటిలో ఏవిధమైన డస్ట్ వచ్చి చేరినా కండ్లలో గద్దలగా తయారు అవుతుంది.  కళ్ళు నీలి రంగులోకి మారడం.. మనశరీరం లో బ్రెయిన్ కిఆక్సిజన్ సరిగా అందక పోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల కళ్ళు నీలిరంగులోకి మారవచ్చని తెలుస్తోంది. ఐ బ్యాగ్స్.. కంటికింద బ్యాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా అతిగా మధ్యం తాగేవారిలో లివర్ సమస్యలు కంటికింద ఐ బ్యాగ్స్ లాగా వస్తాయి. కళ్ళు మండడం.. కళ్ళు మండడం సహజంగా వచ్చే సమస్య. అయితే కళ్ళు మండ దానికి కారణాలలో ఎక్కువ కాంతి చూడడం.లేదా ఎక్కువ కాంతిలో పనుచేయడం. ఒత్తిడికి గురికావడం. నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నందున కళ్ళు మండడం లేదా మీరు పనిచేసే ప్రాంతాలలో రసాయనాల మధ్య లేదా దుమ్ము ధూళి ఉన్నచోట కళ్ళు మండడం సహజంగా ఉంటుంది. కళ్ళు మూతలు పడడం.. కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ఇది ఒక న్యురోలోజికల్ దిజార్దర్ గా పెర్కిన్నారు. ఈ సమస్యకు కారణం బాగా నిల్వ ఉన్న తీసుకున్న వారికి వస్తుందని నిపుణులు నిర్దారించారు. కంటి కింద నల్లటి వలయాలు .. కొందరిలో కంటికింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం స్టమక్ దిజార్దర్ గా పేర్కొన్నారు. కాగా సహజంగా ఒత్తిడికి గురికావడం. లేదా యాన్కజైయిటీ వల్ల కంటికింద న్హల్లటి వలయాలు వస్తాయని నిపుణులు తేల్చి చెప్పారు. కళ్ళు డీవియేట్ కావడం.. శరీరంలో కళ్ళు ఒక్కోసారిషిఫ్ట్ అవుతూ ఉంటాయి.దీనికి కారణం  పోషక ఆహార లోపంగా పేర్కొన్నారు. అంటే సరైన పోషకాలు  లేనండువల్లె కళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటాయికళ్ళను పరిశీలించడం ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పవచ్చ్గు. నాడీ పతి ద్వారా ఎన్నోరకాల రుగ్మతలను చెప్పుకోవచ్చు. ఈ పద్దతిని నాడీ పతి లో ఇరిదోలజీ అని అంటారు.మనం చెప్పుకున్న కొన్ని అంశాలు పైకి కనిపించే కళ్ళ యొక్క సిమ్టమ్స్  ను ఆధారంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. దీనిఆదారంగానే చికిత్చ తీసుకోవచ్చు అని నిపుణులు పేర్కొన్నారు.  

ఆహారంలో ఫైబర్ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం లేకుండా ఒక పూట,   ఒక రోజు ఉండగలరు.  బలవంతంగా ఉండేవారు మహా అయితే రెండు రోజులు ఉండగలరు. కానీ ఆహారం లేకుండా రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించడం చాలా కష్టం.  శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు కూడా అంతే అవసరం.  ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు అంటూ లెక్క గట్టేవారు ఫైబర్ గురించి పెద్దగా ఆలోచించరు.  ఆహారంలో పీచు ఎక్కువగా ఉన్న వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతూ ఉంటారు. అసలు ఆహారంలో పీచు పదార్థాలు ఎందుకు తీసుకోవాలి? ఆహారంలో పీచు పదార్థాలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ఫైబర్.. శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  కార్బోహైడ్రేట్లతో పాటు పీచు కూడా అవసరం.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడంలోనూ, జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండటంలోనూ పైబర్ కీలక పాత్ర పోషిస్తుంది.  ఇక ఫైబర్ చాలా మెల్లిగా జీర్ణం అవుతుంది కాబట్టి ఫైబర్ కలిగిన ఆహారం  తీసుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.  ఇది బరువు తగ్గడానికి, ఆకలి నియంత్రణకు, అతిగా తినే అలవాటుకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది. ఫైబర్ కోసం పండ్లను నేరుగా తినాలి.  వాటిని జ్యూస్ తీసి అందులో ఉన్న పైబర్ ను చెత్తబుట్ట లో తోయకూడదు. ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  పొట్టను శుభ్రం చేస్తుంది.  అదే ఆహారంలో పైబర్ లేకపోతే పొట్ట ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం దెబ్బ తిని మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రేగులలో మంచి గట్ మైక్రోబ్స్ ఉంటాయి.  ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి.  కానీ ఫైబర్ తీసుకోకపోతే ఈ సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు, వాపులు వంటి కడుపు సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రోజువారీ శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి కూడా పైబర్ లేకపోవడం కారణం అవుతుంది. ఫైబర్ లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు పెరగడం జరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.                                                *రూపశ్రీ.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ఆహారాలు పొరపాటున కూడా తినకూడదు..!

థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి.   ఇది హార్మోన్లను విడుదల చేయడం ద్వారా  పలు శారీరక విధులు సక్రమంగా ఉండేలా చేస్తుంది.  ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగా లేకుంటే శరీరంలో చాలా కార్యకలాపాలు గాడి తప్పుతాయి.  థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత దెబ్బతింటుంది. ఇంతకీ ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలంటే.. సోయా ఉత్పత్తులు.. సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.  ఇది థైరాయిడ్ కోసం వాడే మందుల శోషణను అడ్డుకుంటుంది.  సోయా ఉత్పత్తులైన సోయా బీన్స్,  సోయా పాలతో చేసే పనీర్,  సోయా పాలు,  పచ్చిగా బీన్స్ లాగా ఉన్న సోయాను ఎడమామ్ అంటారు.. ఇవన్నీ కూడా సోయాకు సంబంధించినవే.. వీటిని థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకూడదు. క్రూసిఫరస్ కూరగాయలు.. బ్రోకలి, కాలిఫ్లవర్,  క్యాబేజీ వంటి కూరగాయలను క్రూసిఫరస్ జాతికి చెందిన కూరగాయలు అంటారు.  వీటిలో గోయిట్రోజెన్ లు ఉంటాయి.  ఇవి పెద్ద మొత్తంలో తీసుకుంటే ప్రమాదం.  ముఖ్యంగా వీటిని చాలామంది డైట్ లో భాగంగా పచ్చిగానే తింటూ ఉంటారు. కానీ ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. గ్లూటెన్.. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉన్నవారు గ్లూటెన్ ఆహారాలు తీసుకోకూడదు. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్ వాపు మరింత పెరుగుతుంది. గోధుమలు, బార్లీ,  బియ్యం మొదలైనవాటికి దూరంగా ఉండాలి. చక్కెర.. చక్కెర చాలామందికి సాధారణం అయిపోయింది. కానీ చక్కెరతో కూడిన స్నాక్స్,  డ్రింక్స్ బరువు పెరగడానికి దారి తీస్తాయి. అంతే కాదు ఇవి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. థైరాయిడ్ సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ ఫుడ్స్ కూడా థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడదు.  వీటిలో  ప్రిజర్వేటివ్ లు అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.  ఇవి థైరాయిడ్ వాపుకు,  బరువు పెరగడానికి దారితీస్తాయి. అయోడిన్.. అయోడిన్  ఆరోగ్యానికి మంచిదే కానీ.. అయోడిన్ అధికంగా ఉన్న ఉప్పును తీసుకుంటే థైరాయిడ్ పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు  అయోడిన్ ను చాలా పరిమితంగా తీసుకోవాలి. ఫ్రైస్.. వేయించిన ఆహారాలు కూడా థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. వేయించిన ఆహారాలు బరువు పెరగడానికి థైరాయిడ్ గ్రంథి వాపుకు దారితీస్తాయి.  థైరాయిడ్ ఆరోగ్యా్న్ని ప్రతికూలంగా మారుస్తాయి. కెపిన్.. కెఫిన్ ఉన్న కాఫీ, టీ,  శీతలపానీయాలు తీసుకుంటే థైరాయిడ్ పనితీరు దెబ్బ తింటుంది. ఆందోళనను పెంచుతుంది.  ఇది థైరాయిడ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.                                                   *రూపశ్రీ.

స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..!

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు ఇతర దేశాల పండ్లు, ఆహారాలు భారతదేశ ప్రజలకు చాలా నచ్చేస్తాయి. పైపెచ్చు మార్కెటింగ్ వ్యాప్తి కారణంగా విదేశీ పండ్లు కూడా పెద్ద నగరాలలో, కొన్ని నిర్ణీత ప్రాంతాలలో లభిస్తాయి. ఇలాంటి వాటిలో స్టార్ ప్రూట్ కూడా ఒకటి. స్టార్ ప్రూట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణ ఆరోగ్యానికి..  ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల  జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో  స్టార్ ఫ్రూట్ ప్రబావవంతంగా ఉంటుంది. ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను మెయింటైన్ చేయడంలో  ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా  ఇందులో  ఉండే సహజ ఎంజైమ్‌లు,  ప్రోటీన్లు  కొవ్వుల జీర్ణక్రియలో సహాయపడతాయి.  పోషకాలు సమర్థవంతంగా గ్రహించడంలోనూ,  జీర్ణ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి,  ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఫ్రీరాడికల్స్ అనేవి అస్థిర అణువులు, శరీరంలో కణాల  నష్టాన్ని కలిగిస్తాయి.  క్యాన్సర్స  గుండె జబ్బులతో సహా వివిధ దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం అవుతాయి.  ఆహారంలో స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అదే విధంగా శరీర రక్షణ వ్యవస్థను బలపరచుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. స్టార్ ఫ్రూట్ విటమిన్ సి, విటమిన్ ఎ,  జింక్‌తో సహా రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల నిధి. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.  అంటువ్యాధులు,  అనారోగ్యాలను మరింత సమర్థవంతంగా నిరోధించడంలో సహాయపడతాయి. స్టార్ ఫ్రూట్  రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల  శరీరంలో  సహజంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  సీజనల్ సమస్యలుగా వచ్చే  జలుబు, ఫ్లూ,  ఇతర అంటు వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం..  స్టార్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ గుండె ఆరోగ్యానికి చాలా అవసరం.  పొటాషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది సోడియం స్థాయిలను నియంత్రించడం,  రక్త నాళాల గోడలను సడలించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఆహారంలో స్టార్ ఫ్రూట్ వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం ద్వారా హైపర్‌టెన్షన్, స్ట్రోక్,  ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇంకా స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం,  ధమనులలో ఫలకం ఏర్పడకుండా చేయడం కూడా వీలవుతుంది. బరువు నిర్వహణ..  బరువును నియంత్రణలో ఉంచడానికి  ప్రయత్నిస్తున్న వారికి స్టార్ ఫ్రూట్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కేలరీలు,  అధిక ఫైబర్ కంటెంట్‌తో ఉండటం వల్ల స్టార్ ఫ్రూట్ కడుపు నిండిన ఫీల్ ఇవ్వడంలో సహాయపడుతుంది.   అతిగా తినడాన్ని నియంత్రించి బరువు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో  సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ పండులో ఉండే సహజ తీపి చక్కెర కలిగిన స్నాక్స్ తినాలనే  కోరిక కూడా తీరుస్తుంది. ఆహారంలో కేలరీలు తగ్గించాలని అనుకునేవారికి మంచిది.                                             *నిశ్శబ్ద.

గోళ్ళ మీద కనిపించే ఇలాంటి లక్షణాలు ఎంత డేంజరో తెలుసా?

చాలామంది వేలి గోళ్ళు, కళ్ళు, పెదవులు, దంతాలు మొదలైనవి చూసి ఆయా వ్యక్తుల శరీరంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయనేది చెప్పేస్తుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు  డాక్టర్లు కూడా మొదట నాలుక, కళ్లు, చేతివేలి గోళ్లు చూస్తుంటారు.ఆ తరువాతే స్టెతస్కోప్ తో గుండె  వేగాన్ని చెక్ చేస్తుంటారు. అయితే చేతివేలి గోళ్లలో కనిపించే కొన్ని లక్షణాలు చాలా ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుంది. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్.  ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతోంది.  క్యాన్సర్ లలో పలురకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా  ప్రమాదకరమైనది అయినప్పటికీ అత్యంత  సాధారణ కేసులు రొమ్ము, పెద్దప్రేగు, పురీషనాళం, ప్రోస్టేట్,  ఊపిరితిత్తుల మొదలైన క్యాన్సర్ లుగా నమోదు అవుతున్నాయి. వీటన్ని వెనుక   ఉన్న అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, దీనికారణంగా ఎంతో మంది వివిధ రకాల జబ్బులతో పోరాడుతున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గణాంకాలు ఎలా ఉన్నాయి? ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం 2020 సంవత్సరంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచ వ్యాప్తంగా 18లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. వీరిలో అధికశాతం మంది పేలవమైన జీవనశైలి కలిగి ఉన్నవారే కావడం గమనార్హం. ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాలు.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో వివిధ లక్షణాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ దగ్గుతూ ఉంటారు. దీనికి తోడు ఊపిరి తీసుకోవడంలో సమస్య, ఛాతీ నొప్పి, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం, ఆకలి లేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు గొంతులో మార్పు, ఊహించని విధంగా బరువు తగ్గడం, ఎప్పుడూ అలసటగా ఉంటడం,  భుజంలో నొప్పి వంటి సమస్యలు ఉంటాయి. గోర్ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను పైన చెప్పుకున్న అన్ని లక్షణాల ఆధారంగానే కాదు, గోళ్ల కండీషన్ ను బట్టి కూడా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి  చేసిన  కొన్ని పరిశోధనల ప్రకారం   నెయిల్ క్లబ్ లు ఉన్నవారిలో 80శాతం మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఇది శరీరంలో ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుందని వారు తెలిపారు. అసలు నెయిల్ క్లబ్బింగ్ అంటే.. నెయిల్ కర్లింగ్ ను నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. కర్లింగ్ అంటే వంపులు తిరిగి ఉండటం. గోర్లు వంకరగా, వెడల్పుగా వాపు కలిది ఉండటం, పై నుండి కిందకు వంగి ఉండటాన్ని నెయిల్ క్లబ్బింగ్ అని అంటారు. ఈ నెయిల్ క్లబ్బింగ్ లో మొదట  గోర్లు పట్టుత్వం కోల్పోతాయి. ఆ తరువాత గోరు వేలు లోపలినుండి కూడా కదలడం, అది కేవలం వేలి మాంస కండ మీద అలా అతుక్కున్న విధంగా అనుభూతిని ఇస్తుంది. జస్ట్ అలా లాగితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కేవలం ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు.. ఇలా గోర్లు వేలి మూలాల నుండి కదిలినట్టు, పట్టు లేనట్టు ఉంటే అది కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ అయ్యే అవకాశం 80శాతం ఉంది. మిగిలిన  ఛాన్సెస్ లో కుటుంబ చరిత్ర ఆధారంగా ఉదరకుహుర వ్యాధి, లివర్ సిర్రోసిస్, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు అవకాశం ఉంది. కాబట్టి గోర్లు ఎప్పుడైనా దారుణమైన కండీషన్ కు లోనైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవడం ప్రమాదాన్ని  ముందే గుర్తించి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది.                                                       *నిశ్శబ్ద.

ఈ ఒక్కటి తింటే చాలు.. ఫైల్స్ సమస్య మటాష్!

Hemorrhoids లేదా పైల్స్ అనేది బాధాకరమైన వ్యాధి, ఇది పురీషనాళంలో గడ్డలు లేదా రక్తస్రావం కలిగిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా మలబద్ధకం వల్ల వస్తుంది. పైల్స్ ఉన్న రోగులు ప్రేగు కదలికల సమయంలో ఆసన ప్రాంతంలో తీవ్రమైన నొప్పి, మంట, రక్తస్రావం ఇంకా దురద వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. పైల్స్ చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధి కావచ్చు, కానీ ఇది చాలావరకు  అలా వచ్చి నయమైపోతుంది. పురీషనాళం మరియు పాయువుకు మద్దతు ఇచ్చే కణజాలం బలహీనంగా మారడం వల్ల హేమోరాయిడ్లు వచ్చే ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది. పైల్స్ రెండు రకాలు, వాటిలో ఒకటి మలద్వారం వెలుపల రక్తస్రావం జరగని మొటిమలు. రెండు లోపల రక్తస్రావం ఉండే మొటిమలు. పైల్స్‌కు వెంటనే చికిత్స చేయడం అవసరం. మీరు పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే లేదా ఈ  వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటే, దానిని త్వరగా తొలగించడానికి కందగడ్డ తినాలి. ఇది మార్కెట్లో బానే దొరుకుతుంది. దీన్ని నెయ్యిలో వండి వారానికి మూడుసార్లు తింటే ఫైల్స్ సమస్య నుండి  ఉపశమనం కలుగుతుంది.  ఇకపోతే.. వేసవి కాలం మొదలైంది, అలాంటి పరిస్థితుల్లో ఫైల్స్ సమస్య ఉన్నవారు  మజ్జిగ బాగా తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. మలబద్ధకం, పైల్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పైల్స్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి మరొక మార్గముంది. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ దేశీ ఆవు నెయ్యి కలిపి త్రాగాలి. ఇది ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఫైల్స్ సమస్యకు ముఖ్యకారణం మలబద్ధకమని అందరికీ తెలుసు. అయితే నీరు సరిగా తాగకపోవడమే మలబద్ధకానికి ప్రధాన కారణం. నీరు తాగడం వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. వేసవి కాలంలో తమలపాకుల వినియోగాన్ని పెంచడం ద్వారా కూడా ఈ మలబద్ధకాన్ని అధిగమించవచ్చు.  రాత్రిపూట మాంసాహారం లేదా ఇతర బరువైన ఆహారాన్ని తినేవారిలో మీరూ ఉంటే.. , ఈ అలవాటును మార్చుకోవాలి. నిజానికి ఈ అలవాటు మలబద్దకానికి కారణమవుతుంది. రాత్రి భోజనం ముందుగానే తినాలి, అది కూడా తేలికగా ఉండాలి.  ఇవి మాత్రమే  కాకుండా  పైల్స్ సమస్యలో కలిగే నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడానికి, ప్రతిరోజూ 10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో కూర్చోవాలి.  దీనిని సిట్జ్ బాత్ అని పిలుస్తారు. ఇవన్నీ పాటిస్తే ఫైల్స్ సమస్య తొందరగా తగ్గిపోతుంది.                                     ◆నిశ్శబ్ద.

శరీరానికి కొవ్వు కూడా అవసరమే.. ఎందుకంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు,  తదితరాలు పోషకాహారంలోనే  సమృద్ధిగా ఉంటాయి. శరీరం సరిగ్గా పని చేయడానికి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. కొవ్వు కూడా వాటిలో ఒకటి. అయితే, కొవ్వును తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి కొవ్వు చాలా అవసరం. ఈ కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది.   ఆరోగ్యకరమైన కొవ్వు ,  అనారోగ్యకరమైన కొవ్వు. మనకు ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం.   చాలా మందికి ఆరోగ్యకరమైన కొవ్వులు ఏవో, అవి ఎందులో లభిస్తాయో వాటి ఉపయోగాలు ఏంటో సరిగ్గా తెలియదు.  దీని గురించి తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన కొవ్వు అంటే.. కొవ్వులు కూడా ఒక రకమైన పోషకాలు. ప్రొటీన్-ఐరన్ లాగా మన శరీరం శక్తిని పొందడానికి, విటమిన్‌లను శోషించడానికి,మెరుగైన గుండె,మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం. మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను  ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు. ఇవి  అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన కొవ్వులు ఎందుకు ముఖ్యమైనవంటే.. కండరాలను నిర్మించడానికి ప్రోటీన్, రక్త పరిమాణాన్ని నిర్వహించడానికి శరీరానికి ఐరన్ ఎలా  అవసరమో, అదే విధంగా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా  చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలపై చేసిన అధ్యయనాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందని , శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని స్పష్టం చేశాయి. ఆరోగ్యకరమైన కొవ్వును డైటరీ ఫ్యాట్ అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కానీ  దానిని అధికంగా తీసుకుంటే, అది  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో అనేక రకాలుగా పొందవచ్చు.   సాల్మన్, మాకేరెల్ మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి  ఆరోగ్యకరమైన కొవ్వులు.  అలాగే ఆలివ్ నూనె, బీన్స్, అవకాడో, బాదం, నెయ్యి వంటి వాటిలో ఆగోర్యకరమైన కొవ్వులు ఉంటాయి.    ◆నిశ్శబ్ద.

దేవినవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా... ఈ జాగ్రత్తలు పాటించండి!

  నవరాత్రులు హిందువులకు పెద్ద పండుగ. నవరాత్రి పర్వదినాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రోజూ నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఉపవాసం ఉండి పూజలు చేయడం సంప్రదాయం. మీరు కూడా నవరాత్రి పండుగ సమయంలో ఉపవాసం ఉంటే, మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. వారానికోసారి ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రతిరోజూ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సాధారణంగా ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రిటిస్ విషయంలో తక్షణ ఉపశమనం పొందడానికి ఏమి తినాలో తెలుసుకుందాం. అరటి పండు: అరటిపండు ఒక అద్భుతమైన సహజమైన ఆహారం. గ్యాస్టిక్ సమస్యను దూరం చేయడంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండి ఎసిడిటీ లక్షణాలను దూరం చేస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం కంటెంట్ కడుపు,  శరీరం యొక్క pH స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎసిడిటీని పూర్తిగా దూరం చేస్తుంది. ఈ సందర్భంగా వీలైనంత వరకు పండిన అరటిపండ్లను తినండి. చల్లని పాలు: మీ గ్యాస్ట్రిక్ సమస్య చాలా త్వరగా తగ్గాలంటే, వెంటనే ఒక గ్లాసు చల్లని పాలు తాగండి. ఇది మీ పొట్టలో ఎసిడిటీని నివారిస్తుంది. చల్లని పాలు మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే చాలా ఆమ్ల పదార్థాలను గ్రహిస్తాయి. ఇది ఉబ్బరం,  గుండెల్లో మంట నుండి మిమ్మల్ని నివారిస్తుంది. అయితే పాలలో చక్కెరను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. పెరుగు లేదా మజ్జిగ: మజ్జిగ, పెరుగు కూడా మీ గ్యాస్ట్రిక్ సమస్యను వదిలించుకునేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది అపానవాయువు, గుండెల్లో మంటలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.  కడుపులో చికాకు,  అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీ శరీరానికి అనేక రకాల మంచి పోషకాలను అందజేస్తుంది.  మీ జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. వేడినీరు తాగడం: అనేక ఆరోగ్య సమస్యలకు వేడినీరు దివ్యౌషధం. అదేవిధంగా, కడుపులోని ఆమ్లత్వం, గుండెల్లో మంట సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు నవరాత్రి ఉపవాస సమయంలో అసిడిటీని అనుభవిస్తున్నట్లయితే, వెంటనే వేడి నీటిని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. మీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. వేడి నీళ్ళు మీ పొట్టలోని ఎసిడిటీని చాలా వరకు తగ్గిస్తాయి. పుచ్చకాయ పండు: పుచ్చకాయ పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన వారికి, గ్యాస్ట్రిక్ విషయంలో దీనిని తీసుకోవడం కొత్త విషయం కాదు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్ట్  అంటున్నారు.

ఈ డ్రింక్స్ తాగండి.. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి..!

  ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.  ఇవి శ్వాస వ్యవస్థకు మూలం.  మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి,  కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర.  సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి.  ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా.  ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి.  అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే  కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి. తులసి నీరు.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.  రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ.. అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనా టీ.. పుదీనాలో మెంథాల్ ఉంటుంది.  ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో,  శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.  పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాము నీరు.. వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది.                                                  *రూపశ్రీ.

రాత్రి సమయంలో త్వరగా నిద్ర పట్టడం లేదా? ఈ  పనులు చేయండి..!

  నిద్ర గొప్ప మెడిసిన్ అంటారు.  కంటి నిండా నిద్రపోయేవారి ఆరోగ్యం చాలా మటుకు చాలా బాగుంటుంది.  హాయిగా నిద్ర పోయే వారు మానసిక ఒత్తిడి,  డిప్రెషన్,  ఆందోళన వంటి మానసిక సమస్యలను చాలా బాగా డీల్ చేయగలుగుతారు. అంతేనా రాత్రి సమయంలో బాగా నిద్రపోయేవారు తమ రోజును పర్పెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. రాత్రి సమయంలో నిద్రపోయే వారి శరీరంలో నిద్ర చక్రం ఒక క్రమ పద్దతిలో పనిచేస్తుంది.  అయితే ఈ కాలంలో చాలామంది నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు.  రాత్రి తొందరగా పక్క మీదకు చేరినా తొందరగా నిద్ర పట్టక గంటలు గంటలు దొర్లుతూ కాలం గుడుపుతారు.  అయితే కొన్ని పనులు చేయడం వల్ల రాత్రి సమయంలో హాయిగా నిద్ర పోవచ్చట. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. శ్వాస.. లోతైన శ్వాస వ్యాయామాలు శరీరాన్ని, మెదడును, మనస్సును అలసట , ఒత్తిడి నుండి బయటకు తెస్తాయి.  ఈ కారణం వల్ల నిద్రపోయే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి పాటించడం పడుకున్న తరువాత తొందరగా నిద్ర వస్తుంది.  నిద్రలేమి,  తొందరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. శ్రద్ద.. శ్రద్ద వల్ల నిద్ర పట్టడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర పట్టడం కోసం చేసే లోతైన శ్వాస వ్యాయామాల విషయంలో శ్రద్ద చాలా అవసరం. శ్వాస వ్యాయామాలు మనస్సుకు, శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి  సహజ మార్గంలా సహాయపడతాయి.  ఈ శ్వాస వ్యాయామాలు శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.  ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. డిజిటల్ డిటాక్స్.. డిటాక్స్ అంటే కలుషితం అవ్వడం.  డిజిటల్ యుగంలో శరీరం చాలా రకాల సమస్యలతో కలుషితం అవుతోంది.  ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ ఉండాల్సిందే.. ఇలా రాత్రి పడుకునేవరకు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అది నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. ఫోన్ లేదా టీవి, ల్యాప్టాప్ నుండి వెలువడే నీలి కాంతి కళ్లకు ఎఫెక్ట్ ఇస్తుంది.  ఈ కాంతి తగిలిన తరువాత తొందరగా కళ్లు విశ్రాంతిలోకి వెళ్లలేవు. అందుకే వీటికి దూరం ఉండాలి. నిద్ర పోవడానికి కనీసం గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీ వంటి పరికరాలను బంద్ చేయాలి. మెలటోనిన్ లోపం.. మెలటోనిన్ అనేది హార్మోన్.  మెలటోనిన్ నిద్రకు సహాయపడుతుంది.  ఇది మెదడు పనితీరు ద్వారా ఉత్పత్తి అవుతుంది.  రాత్రి సమయంలో ఫోన్,టీవి, ల్యాప్టాప్ వంటి స్క్రీన్లు పడుకునే వరకు చూడటం వల్ల స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మెదడును యాక్టీవ్ గా ఉంచుతుంది. మెదడు ఎక్కువసేపు యాక్టీవ్ గా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి నిద్రకు ఆటంకం కలుగుతుంది.                                              *రూపశ్రీ.