నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: చంద్రబాబు
posted on Aug 17, 2012 @ 10:15AM
ప్రధానమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం స్పష్టం చేశారు. మెదక్ జిల్లా సదాశివపేటలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఇఫ్త్తార్ విందు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశానికి సుభిక్షం కాదని, సెక్యులర్ భావాలు గల వ్యక్తికే మద్దతు ఇస్తామని బాబు చెప్పారు. ముస్లింల అభివృద్ధికి అవసరమైన చర్యల కోసం పార్టీ పరంగా కమిటీ వేశామన్నారు. అందులో చర్చించి త్వరలో ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. కాగా త్వరలోనే తాను ఉర్దూ నేర్చుకుంటానని చంద్రబాబు తెలిపారు. అయితే 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఫోకస్ అవుతున్న దృష్ట్యా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.