చీప్ బుద్ధి ప్రదర్శించిన చీఫ్ సెక్రటరీ
posted on May 13, 2024 @ 10:31AM
ఉద్యోగులకు (పెన్షనర్లతో సహా) చెల్లించాల్సిన కరవు భత్యం (డిఏ), ఇతర బకాయిల మొత్తాన్ని ఈ రోజు తెల్లవారు ఝామునే వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడం కదా! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న దానికి ఇది ప్రబల నిదర్శనం కాదా! ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించా అని సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తున్నారు.