మొరాయిస్తున్న ఈవీఎంలు

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ఉత్సాహం మీద పలు చోట్ల ఈవీఎంలు నీళ్లు చల్లుతున్నాయి. రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలంగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ లలో వేచి ఉన్నారు. అయితే రాష్ట్రంలోని ఏపీలోని పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి.  పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని దుండగులు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. పోలింగ్ బూత్ లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. 

మంగళగిరి నియోజకవర్గంలోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొప్పురావుకాలనీ, సీకే హైస్కూల్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, మోరంపూడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్యను సరిచేసేందుకు పోలింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ గంటకుపైగా నిలిచిపోయింది.  పల్నాడు, పుంగనూరులలో వైసీపీ మూకలు దౌర్జన్యాలకు తెగబడ్డాయి. 

Teluguone gnews banner