వేదాలు వల్లిస్తున్న వైసీపీ దయ్యం!!

దయ్యాలు వేదాలు వల్లించడం ఎప్పుడైనా చూశారా? ఎప్పుడూ చూసి వుండకపోతే, పోలింగ్ హింస అనే పాయింట్ మీద కడప ఎంపీ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మాటలు వింటే ఆ అదృష్టం కలుగుతుంది. కడప జిల్లాలో పోలింగ్ హింస జరిపేదే జగన్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడే పోలింగ్ హింస జరక్కుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కడపలో పోలింగ్ హింసకు టీడీపీ కుట్ర చేస్తోందట. పోలింగ్ ప్రారంభంలోనే పులివెందులలో మొదట హింస రేపాలన్నది టీడీపీ పన్నాగమట. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అలాంటి హింస చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే చంద్రబాబు దీని మీద డైరక్షన్ ఇచ్చారట. తమ అనుకూల అభ్యర్థులు, ఏజంట్లతో హింసకు టీడీపీ ప్రయత్నిస్తోందట. అనుకూల మీడియా ద్వారా ఆ ఘటనలకు విస్తృత ప్రచారం కల్పించేలా వ్యూహం పన్నారట. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, వ్యక్తిత్వ హనానికి పాల్పడేందుకు ఈ వ్యూహం పన్నారట. స్వేచ్ఛగా, నిర్భయంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి నష్టమట, అందుకే ఇలాంటి కుట్రలు పన్నారట. ఎన్నికల సంఘం, పోలీసులు స్వేచ్ఛగా, నిర్భయంగా ఎన్నికలు జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తిచేస్తున్నారట.. 

ఓరి నాయనా, మీరేం చేయబోతున్నారో ముందుగానే మీడియాకి లీక్ ఇచ్చారన్నమట. మీరు ఈ ఎన్నికలలో ఇలాంటి దారుణాలన్నీ చేసి, వాటన్నటినీ టీడీపీ అకౌంట్లో వేయడానికి ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టేశారన్నమాట. అవినాష్ రెడ్డి పైన పేర్కొన్న దుర్మార్గాలన్నీ చేయడానికి ప్రిపేర్ అయినట్టు అర్థమైపోయింది. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా వుండాలి.

Teluguone gnews banner