వర్ష వాడిన పిస్టల్ పై వీడుతున్న మిస్టరీ

 

ఆశా భోంస్లే కూతురు వర్షాభోంస్లే ఆత్మహత్యకి వాడిన పిస్టల్ ఎవరిదన్న విషయంలో దర్యాప్తు కాస్త ముందుకు సాగింది. బెల్జియంలో తయారైన పిస్టల్ ని స్పాట్ నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆశా కొడుకు ఆనంద్ పేరుమీద ఆ పిస్టల్ రిజిస్టరైఉంది. చాలాకాలం క్రితం తాను ఆ పిస్టల్ ని కొన్నానని, ఎక్కడో దాచిపెట్టిన పిస్టల్ చాలాకాలంగా కనిపించడంలేదని, అది తన కూతురికి ఎలా దొరికిందో తెలీదని ఆశా భోంస్లే చెప్పడంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయ్. పిస్టల్ నిజంగా ఆశాభోంస్లేదే అయితే చిన్నకొడుకు ఆనంద్ పేరుమీద ఎందుకు రిజిస్టరై ఉందన్నది మొదటి అనుమానం. చాలాకాలం క్రితం కనిపించకుండా పోయిందని చెబుతున్న పిస్టల్ వర్ష చేతిలో ఎలా పడిందన్నది రెండో అనుమానం. ఇలా తవ్వుకుంటూ పోతే మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయని ముంబై వాసులు అనుకుంటున్నారు. పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకెళ్తున్నారు. వర్ష చాలా దగ్గరినుంచి కాల్చుకోవడంవల్ల బ్రెయిన్ హెమరేజ్ వచ్చి, విపరీతంగా రక్తంపోయి చనిపోయిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ చెబుతోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.