వర్షాభోంస్లే కాల్చుకున్న రివాల్వర్ ఎవరిది?

ప్రముఖ గాయని ఆశాభోంస్లే కూతురు వర్షా భోంస్లే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హఠాత్ పరిణామానికి కుటుంబం మొత్తం నివ్వెరపోయింది. వర్షా తల్లితోపాటు పెద్దమ్మ లతా మంగేష్కర్ కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. కానీ.. ఆత్మహత్యచేసుకోవడానికి వర్ష ఉపయోగించిన తుపాకీ ఎవరిదన్న విషయం మాత్రం మిస్టరీగానే ఉంది. బెల్జియంలో తయారైన 0.6 కాలిబర్ పిస్టల్ ఎవరిదన్న ప్రశ్న ఇంకా పోలీసుల బుర్రల్ని తొలుస్తూనే ఉంది. పోలీసులు చెబుతున్నదాని ప్రకారం వర్ష కొద్ది రోజులుగా తీవ్ర మైన డిప్రెషన్ లో కూరుకుపోయి వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకుంటోంది. ప్రభుకుంజ్ లోని ఆషాభోంస్లే ఇంట్లో సోఫాలో వేలాడుతూ వర్షా భోంస్లే శవం కనిపించింది. ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరూ వర్ష ఉపయోగించిన తుపాకీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ముందుకురాలేదు. ఉషామంగేష్కర్, దగ్గరి బంధువు రచనా షా, డ్రైవర్ విజయ్, పనిమనిషి రూపాలీల స్టేట్ మెంట్లని పోలీసులు రికార్డ్ చేశారు. బుల్లెట్ దూసుకుపోవడంవల్ల మెదడు దెబ్బతినడం, బాగా రక్తం కారిపోవడంవల్ల వర్షా చనిపోయిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో ఉంది. గతంలోకూడా వర్ష రెండుసార్లు ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.