ఢిల్లీలో డి.కె.అరుణ తెలంగానం

తెలంగాణ విషయంలో మహబూబ్ నగర్ జిల్లా వాసుల సత్తాని చూపించేందుకు మంత్రి డి.కె.అరుణ రెడీ అవుతున్నారు. జిల్లా తరఫున ఓ ప్రత్యేక బృందాన్ని తీసుకుని హస్తినకు వెళ్లి పరోక్ష బలప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాకి చెందిన ముఖ్యనేతలంతా అరుణ వెనకాలే నడుస్తూ ఢిల్లీ పెద్దలకు తీవ్రస్థాయిలో నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధపడుతున్నారు. అక్టోబర్ మూడోవారంలో తెలంగాణ మంత్రులంతా కలిసి ఢిల్లీకెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని బసవరాజు సారయ్య వెల్లడించారు. బయోడైవర్సిటీ సదస్సుకోసం హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఓ బృందంగా ఏర్పడి తెలంగాణ మంత్రులంతా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఒత్తిడి తీసుకురావాలన్నది డి.కె.అరుణ టీమ్ ఆలోచనగా కనిపిస్తోందని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డి.కె.అరుణ ఆధ్వర్యంలో ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం ప్రయాణమవుతున్న విషయాన్ని ఎఐసిసి జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా ధృవీకరించారు. తెలంగాణ విషయంలో ఇప్పటికే టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో మంతనాలు జరిపానని, ఆయన చెప్పిన విషయాలన్నీ సోనియాగాంధీకి నివేదించానని ఆస్కార్ ఫెర్నాండెజ్ చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ ని, ఎఐసిసి జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫెర్నాండెజ్ ని, కేంద్ర హోంమంత్రి సుసీల్ కుమార్ షిండేని కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో మంతనాలు జరపాలని డి.కె.అరుణ బృందం భావిస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.