Read more!

ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహిళల పాలిట ప్రత్యక్ష నరకంలా మారింది. ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం, హత్యలు నిత్యకృత్యమైపోయాయి. గత నెల రోజులలో పదికి పైగా అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా బుధవారం నాడు మరో దారుణం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ మాఫియా ఒక మహిళపై అత్యాచారం చేసి, తర్వాత ఆమెని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. యు.పి.లోని బహరైచ్ జిల్లాకి చెందిన ఒక మహిళ స్థానిక లిక్కర్ మాఫియా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కక్షతో సదరు లిక్కర్ మాఫియా ఆ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు.