Read more!

సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

 

 

 

సివిల్ సర్వీసెస్ -2013 ఫరీక్షల ఫలితాలను యుపిఎస్‌సి గురువారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో పరీక్షల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి సత్తా నిరూపించుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాదాపు 40 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఐఏఎస్ కేడర్‌కి 20 మంది ఎంపికయ్యారు. సివిల్స్ పరీక్షల్లో 2013 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా 1122 మంది విజయం సాధించారు. జైపూర్‌కు చెందిన గౌరవ్ అగర్వాల్ జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. రెండు, మూడు ర్యాంకుల్ని ఢిల్లీకి చెందిన మునీష్ శర్మ, జార్ఖండ్‌కు చెందిన రచిత్ రాజ్ సాధించారు. మహిళల విభాగం నుండి టాపర్‌గా ఐదో ర్యాంకర్ భారతి దీక్షిత్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌ విద్యావజ్రం క్రితిక జ్యోత్స్న జాతీయ స్థాయిలో 30వ ర్యాంకును సాధించారు. హైదరాబాదీ ముషారఫ్ అలీ ఫరూఖీ 80వ ర్యాంక్ సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణ ఆదిత్య 99వ ర్యాంక్ సాధించారు.