మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్కి
posted on Jun 13, 2014 @ 5:34PM
హిమాచల్ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు హైదరాబాద్కి చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం ఉపేంద్ర, అరవింద్ అనే ఇద్దరు విద్యార్థులను తీసుకువచ్చిన విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. హైదరాబాద్లోనిన వనస్థలిపురం నివాసి అయిన అరవింద్ మృతదేహాన్ని తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి తరలి వచ్చారు. వారి రోదనలతో విమానాశ్రయంలో విషాద వాతావరణం నెలకొంది. అలాగే ఉపేంద్ర మృతదేహన్ని అతడి స్వస్థలం ఖమ్మం జిల్లా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా, బియాస్ నదిలో గల్లంతైన మొత్తం 24 మందిలో ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి.