Read more!

రాజీనామా బాటలో యూపీఏ గవర్నర్లు

 

 

 

నరేంద్రమోదీ ప్రభుత్వం యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్‌లను మార్చాలని యోచిస్తోన్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బీఎల్‌ జోషి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాలను హోంమంత్రిత్వ శాఖకు పంపించారు. ఆయన బాటలోనే మరో ఐదుగురు గవర్నర్లు కేళర గవర్నర్ షీలా దీక్షిత్, శివరాజ్ పాటిల్, ఎంకే నారాయణ్ కూడా తమ పదవులకు రాజీనామ చేసే అవకాశాలు ఉన్నాయి.కాగా ఆంద్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత రోశయ్య తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తారా?లేక కొనసాగుతారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామాలు చేయాలని బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. యూపీఏ పాలనలో సోనియా విధేయులే గవర్నర్లుగా నియమితులయ్యారని, రాజకీయ లబ్ది కోసమే గవర్నర్ల నియామకం జరిగిందని ఆయన ఆరోపించారు.