కేసీఆర్ వస్తేనే ఎంతోకొంత ఛాన్స్... టీఆర్ఎస్ లీడర్లలో హుజూర్ టెన్షన్

 

హుజూర్‌‌నగర్‌ ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌లో గుబులురేపుతోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. హుజూర్‌నగర్‌లో ఎలాగైనా గులాబీ జెండా పాతాలన్న కృతనిశ్చయమంతో ముందుకెళ్తోన్న టీఆర్‌ఎస్‌కు స్థానిక సమీకరణాలు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... పార్టీ పరిస్థితి, లీడర్ల పనితీరుపై ఏమాత్రం సంతోషంగా లేరట.

దాదాపు పది రోజులుగా టీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జులంతా హుజూర్‌నగర్‌లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు రిపోర్టులు పంపిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు నివేదికలు పంపిస్తున్నా, కేసీఆర్ మాత్రం ప్రైవేట్‌ సర్వేలు చేయించుకుంటూ, రోజువారీ రిపోర్టుల ఆధారంగా టీఆర్ఎస్‌ బలాన్ని అంచనా చేస్తున్నారు. అయితే, సర్వే రిపోర్టులు గులాబీ బాస్‌ను కలవరం పెట్టిస్తున్నాయట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా ఉన్నట్లు తేలిందట. తాను తెప్పించుకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా పార్టీ శ్రేణులకు గైడెన్స్ ఇస్తోన్న కేసీఆర్... క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్ పెట్టాలని చెప్పారట

ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ అభ్య,ర్ధి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటం హైకమాండ్‌కి తలనొప్పిగా మారిందంటున్నారు. కేసీఆర్‌తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్‌‌నగర్‌ టీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు.

Teluguone gnews banner