కేసీఆర్ పై గవర్నర్ ప్రశంశలు
posted on Mar 15, 2021 @ 2:33PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న అన్ని విధాలుగా రాష్ట్రము ముందుకు పోతుందని.. చెపుతూ ముఖ్యమంత్రి సేవలను గవర్నర్ కొనియాడారు..
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
అన్నివర్గాల ప్రజల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామని. కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించాం అనిఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నాం. అంటూ గవర్నర్ ప్రసంగం మొదలైయింది. సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ ముందుకు దూసుకెళ్తోందని ఆమె అన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై దృష్టి సారించామని ,వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందని.. ఈ ఏడాదికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2 లక్షల 28 వేలకు పెరిగిందని.. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటించమని.. కోవిడ్ వల్ల అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి తెలంగాణ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని కరోనాను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని..కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ ఎంతో కష్టపడ్డారని గవర్నర్ తమిళిసై కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్గా ముందుకు సాగుతోందన్న విషయం ఆమె చెప్పుకొచ్చారు..
విద్యుత్ రంగంలో తెలంగాణ అద్వితీయ విజయాలు సాధించింది అతి తక్కువ సమయంలో క్లిష్టమైన సమస్యలను అధిగమించాం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారింది జాతయ సగటు కంటే రాష్ట్ర విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ విద్యుత్రంగ సంస్కరణపై కేంద్రం రాష్ట్రాన్ని ప్రశంసించింది తాగునీటి సమస్యకు మిషన్ భగీరథతో శాశ్వత పరిష్కారం మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది గిరిజన గ్రామాలు, తండాలకు కూడా మంచినీటిని అందిస్తున్నాం 57.26 లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు తెలంగాణను ఫోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాం. మిషన్ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించాం తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి రెవెన్యూ వసూళ్లలో రాష్ట్ర అగ్రగామిగా ఉంది సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది సమైక రాష్ట్రంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం కరువు ప్రాంతాలకు కూడా సాగునీరు ఇచ్చాం భక్త రామదాసు ప్రాజెక్ట్ 7 నెలల్లో పూర్తి త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి డిండి, సీతారామ ఎత్తిపోతలను పూర్తి చేస్తాం రైతు బంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు తెలంగాణలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు తెలంగాణలో 39,36,521 మందికి పెన్షన్లు పెన్షన్ల కోసం ప్రతి ఏటా రూ.8,710 కోట్లు కేటాయింపు ధాన్యం సేకరణలో తెలంగాణ తొలిస్థానంలో ఉంది 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.. ఆమె చెప్పారు.
మంగళవారం నాడు దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 19వ తేదీన సెలవు ఉంటుంది. ఆ తదుపరి రోజు నుంచి బడ్జెట్పై చర్చలు ప్రారంభమవుతాయి. ఇదిలావుంచితే, అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు తొలిసారి అడుగు పెట్టారు. అలాగే, నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు మండలిలో తొలిసారి అడుగు పెట్టనున్నారు.