Read more!

తెలంగాణ రైతుల్ని చచ్చేట్టు కొట్టారు

 

విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తెలంగాణ రైతులను పోలీసులు అన్యాయంగా చావగొట్టారు. బారెడు పొడుగున్న లాఠీలతో గొడ్డులను కొట్టినట్టు కొట్టారు. మెదక్ జిల్లా చేగుంటమండలం నార్సింగిలోని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. గత వారం రోజులుగా రోజుకు కనీసం గంటసేపు కూడా కరెంటు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు మండుతున్న రైతులు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారి మీద హైదరాబాద్ - నిజామాబాద్ మధ్య ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి కడుపు మండుతున్న తెలంగాణ రైతుబిడ్డలను ఓదార్చాల్సింది పోయి పోలీసులు రంగంలోకి దిగారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ రైతు బిడ్డల మీద లాఠీఛార్జ్ చేశారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు ఎదురు తిరిగి పోలీసుల మీద రాళ్ళదాడి చేశారు. చాలామంది రైతులను పోలీసులు చావబాలదారు. చాలామందిని అరెస్టు చేశారు.