Read more!

31 లోగా కౌన్సిలింగ్ పూర్తి చేయాలి: సుప్రీం కోర్టు

 

ఎంసెట్ కౌన్సిలింగ్ ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంసెట్ కౌన్సిలింగ్ మీద దాఖలైన కేసు మీద విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఆగస్టు 31 లోగా కౌన్సిలింగ్ పూర్తిచేసి, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర విభజన ప్రభావం విద్యార్థుల మీద పడకూడదని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయవద్దని అలా రాజకీయం చేస్తున్న వారికి సూచించింది. ఈ అంశం మీద తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ విషయాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తెలియజేస్తూ, ‘‘స్థానికత, ఇతర అంశాల విషయంలో రెండు రాష్ట్రాలూ విభజన చట్టం ప్రకారం వెళ్ళాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం స్థానికత, ఉమ్మడి ప్రవేశాలు తదితర అంశాల్లో విభజన చట్టాన్నే అనుసరించాలి. అలాగే స్థానికత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వుండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది’’ అన్నారు.