Read more!

రైతుల్ని చావగొట్టించాం సారీ: మంత్రి పోచారం

 

విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తెలంగాణ రైతులను పోలీసుల చేత చావగొట్టించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా సారీ చెబుతోంది. అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటున్నారు. నార్సింగిలో రైతుల మీద లాఠీఛార్జ్ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేనని ఆయన తప్పు ఒప్పుకున్నారు. మెదక్ జిల్లాలో తెలంగాణ అన్నదాతలను పోలీసులు లాఠీలతో చావగొట్టిన అంశాన్ని సీఎం సమీక్షించారని పోచారం తెలిపారు.