ఏపీలో ఓట్ల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు వేసే వంతు కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయాలన్న పట్టుదల, సంకల్పం జనంలో కనిపిస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అరాచకత్వం పోవాలన్న ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించి తీరాలన్న బలమైన కాంక్ష ప్రజలలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. పల్నాడు, పుంగనూరు వంటి కొన్ని ప్రాంతాలలో వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు, కిడ్నీప్ లకు తెగబడ్డాయి.

ఆ ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఇక పోతే రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, సెలబ్రిటీలు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 ఎన్నికలలో 80 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం ప్రజలు ఓటింగ్ కు తరలివస్తున్న తీరు చూస్తుంటే ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు 89శాతం పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఇలా ఉండగా  చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు, జగన్ దంపతులు, పవన్ కల్యాణ్ తమ తమ పోలింగ్ బూత్ లలో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే బాలకృష్ణ, వివిధ పార్టీల అభ్యర్థులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఇలా ఉండగా..

ఏపీ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా  వేర్వేరుగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండంటూ  అమిత్ షా ట్వీట్ చేశారు.   

Teluguone gnews banner