కీచక టీచర్... దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు

'ఆచార్యదేవో భవా' అని గురువుకి తల్లి తండ్రి తరువాత స్థానాన్ని ఇచ్చారు మన పెద్దలు. అంతటి గొప్ప స్థానంలో ఉన్న కొందరు గురువులు తమ నైతిక విలువలను సైతం మరిచిపోయి అత్యంత దారుణాంగా ప్రవర్తిస్తున్నారు. నేటి సమాజంలో చెడు వైపుకు వెళ్ళకుండా కాపాడాల్సిన గరువే తన విలువలను సైతం మరచిపోతున్నారు.ప్రకాశం జిల్లాలో ఓ కీచక టీచర్ కు దేహశుద్ధి చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్లో పాఠాలు చెప్పకుండా విద్యార్ధినులతో అసభ్యకరంగా మాట్లాడడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించటం విసుగు తెప్పించింది.

ఈ విషయాన్ని విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టీచర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రకాశం జిల్లాలో  బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి హై స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి.పోలీసులు నిందితుడిని అదుపు లోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 354, ఫోక్సో యాక్ట్ సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Teluguone gnews banner