జూపల్లి కోసం ఎదురుచూశా.. రావుల
posted on Jul 11, 2015 @ 6:40PM
టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ మంత్రి జూపల్లి మీద మండిపడ్డారు. టీడీపీ పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకమని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. అది వాస్తవం కాదని అన్నారు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి ఎన్టీఆర్ భవన్ కు వస్తానని జూపల్లి సవాల్ విసిరారు.. వస్తానని ముఖం చాటేశారని ఎద్దేవ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జూపల్లి కోసం 3 గంటల పాటు ఎదురు చూశానని.. జూపల్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకు టీడీపీ వ్యతిరేకం కాదని.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రావుల చంద్రశేఖర్ రెడ్డి, జూపల్లికి హితవు పలికారు.