డీఎస్ మారడం వల్ల ఏం నష్టంలేదు

 

డీఎస్ లాంటి వారు పార్టీ మారిన ఎలాంటి నష్టం లేదని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ సీఎల్పీ నేతగా జానారెడ్డినే కొనసాగుతారని.. అతనిని మార్చే ఉద్దేశం లేదని స్ఫష్టం చేశారు. దీనికి సంబంధించి తాను ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని సేకరించ లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని దానికోసం త్వరలోనే గ్రామ స్ధాయిలో కమిటీలను నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుందని, ఈ నెలాఖరుకల్లా ఈ కార్యక్రమం దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈనెల 24న రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు రాహుల్ సమారు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Teluguone gnews banner